త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol India | ఇండియా E20 పెట్రోల్‌ను భూటాన్ నిజంగానే రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇండియా సరఫరా చేసే E20 పెట్రోల్‌ను భూటాన్ తిరస్కరించిందంటూ వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ రిపోర్ట్స్‌లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది.

J

National | Published On Jul 5, 2026, 6.08 pm IST

E20 Petrol India | ఇండియా E20 పెట్రోల్‌ను భూటాన్ నిజంగానే రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Advertisement
  • ఇండియా E20 పెట్రోల్‌ను భూటాన్ రిజెక్ట్ చేసిందనే వార్తలను ఖండించిన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ
  • అసలు భూటాన్‌కు E20 ఇంధనాన్ని ఎగుమతి చేసే ప్రతిపాదనను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) చేయలేదని స్పష్టం
  • మౌలిక సదుపాయాల లేమి, ఎత్తైన రోడ్లపై ఇంజిన్ పెర్ఫార్మెన్స్ తగ్గవచ్చనే భయంతో భూటాన్ సాధారణ పెట్రోల్‌నే కోరినట్లు 'ద భూటానీస్' పత్రిక రిపోర్ట్
  • అనధికార వార్తలను నమ్మవద్దని సూచిస్తూ ప్రభుత్వం నోట్‌ విడుదల

E20 Petrol India | త్రినేత్ర.న్యూస్ : భారతదేశం సరఫరా చేసే 'E20 పెట్రోల్‌'ను (E20 Petrol) పక్క దేశం భూటాన్ తిరస్కరించిందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ రిపోర్ట్స్ అన్నీ పూర్తి "అవాస్తవం" అని తేల్చిచెప్పింది.

అసలు ఆఫరే ఇవ్వలేదు

భూటాన్‌కు E20 ఇంధనాన్ని ఎగుమతి చేసేందుకు భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఎలాంటి అధికారిక ప్రతిపాదన చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు ఆఫరే ఇవ్వనప్పుడు.. వారు తిరస్కరించే ప్రసక్తే లేదని వివరించింది. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఫ్యాక్ట్-చెక్ ముద్ర ఉన్న ప్రకటనను రిలీజ్ చేస్తూ, కేవలం మంత్రిత్వ శాఖ లేదా OMCs ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలను కోరింది.

అసలు ఈ పుకార్లు ఎలా మొదలయ్యాయి?

ఈ వివాదం అంతా 'ద భూటానీస్' (The Bhutanese) అనే పత్రికలో వచ్చిన ఒక కథనంతో మొదలైంది. ఇండియన్ మార్కెట్‌లో కన్వెన్షనల్ పెట్రోల్ (సాధారణ పెట్రోల్) అందుబాటులో ఉన్నంత కాలం.. తమకు దాన్నే సప్లై చేయాలని భూటాన్ ప్రభుత్వం ఇండియాను కోరినట్లు ఆ కథనం పేర్కొంది. దానికి వాళ్లు చెప్పిన కారణాలు ఇవే.

స్టోరేజ్ సమస్యలు: భూటాన్‌లో ఇథనాల్ బ్లెండెడ్ (E20) పెట్రోల్‌ను హ్యాండిల్ చేసేందుకు సరిపడా మౌలిక సదుపాయాలు లేవు. పాతబడిన అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు చేరితే ఇంధనం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

భౌగోళిక పరిస్థితులు: భూటాన్ అంతా ఎత్తైన పర్వత ప్రాంతం. ఇలాంటి రోడ్లపై వాహనాలకు గరిష్ఠ పవర్ అవసరం అవుతుంది. E20 పెట్రోల్ ఆ పవర్‌ను స్థిరంగా ఇవ్వలేకపోవచ్చని వారు భావిస్తున్నారు.

సాధారణంగా భారతీయ రిటైల్ అవుట్‌లెట్లలో అమ్మే పెట్రోల్ కంటే కొంచెం ఖరీదైన, హై-క్వాలిటీ ఎక్స్‌పోర్ట్-గ్రేడ్ పెట్రోల్, డీజిల్‌ను భూటాన్.. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటుంది.

ఇండియాలో E20 పై రచ్చ

భూటాన్ వార్తలు ఇలా ఉంటే.. ఇండియాలో ప్రస్తుతం E20 పెట్రోల్ (20% ఇథనాల్, 80% పెట్రోల్ మిశ్రమం) వినియోగం పై పెద్ద చర్చే నడుస్తోంది. ముఖ్యంగా 2023కి ముందు తయారైన పాత పెట్రోల్ వాహనాల్లో ఈ ఇంధనం వాడటం వల్ల మైలేజ్ తగ్గడం, ఇంజిన్ దెబ్బతినడం, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం లాంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది వాహనదారులు విమర్శిస్తున్నారు. అయితే.. మైలేజ్ కొద్దిగా తగ్గినప్పటికీ, ఇంజిన్ యాక్సిలరేషన్, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తోంది.

Advertisement
Advertisement