త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tejas Express | మారిన తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇక‌పై ఏమ‌ని పిలుస్తారంటే?

Tejas Express | దేశంలో మొట్ట‌మొద‌టి ప్రైవేట్‌, బ్రాండెడ్ రైలు (First Private Train) అయిన తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ (Tejas Express) పేరు మారుతున్న‌ది. అత్యాధునిక స‌దుపాయాల‌తో కూడిన ఈ సెమీ హై స్పీడ్ రైలును ఇక‌పై..

G

National | Published On Aug 13, 2026, 9.42 am IST

Tejas Express | మారిన తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇక‌పై ఏమ‌ని పిలుస్తారంటే?
Advertisement

Tejas Express | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో మొట్ట‌మొద‌టి ప్రైవేట్‌, బ్రాండెడ్ రైలు (First Private Train) అయిన తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ (Tejas Express) పేరు మారుతున్న‌ది. అత్యాధునిక స‌దుపాయాల‌తో కూడిన ఈ సెమీ హై స్పీడ్ రైలును ఇక‌పై స్ప్రైట్ తేజ‌స్ ఎక్స్‌ప్రెస్‌గా (Sprite Tejas Express) పిలువ‌నున్నారు. ఢిల్లీ-లక్నో మ‌ధ్య న‌డుస్తున్న ఈ రైలును ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వ‌హిస్తున్న‌ది. అయితే తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ బ్రాండింగ్ ద్వారా ప్ర‌క‌ట‌న‌ల హ‌క్కుల‌ను మిసెస్‌ స్ప్రైట్ (M/s Sprite) అనే సంస్థ ద‌క్కించుకున్న‌ది. దీంతో తేజ‌స్ ఎక్స్‌ప్రెస్‌ను స్ప్రైట్ తేజ‌స్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఆగ‌స్టు 19 నుంచి ఇది అమ‌ల్లోకి రానుంది. ఆరు నెల‌ల పాటు అంటే న‌వంబ‌ర్ 11 వ‌ర‌కు ఇది అమ‌లులో ఉంటుంది. ఈ మేర‌కు నార్త్ ఈస్టర్న్ రైల్వేకు తెలియజేసినట్లు రైల్వే వర్గాలు వెల్ల‌డించాయి.

దేశంలోనే తొలి ప్రైవేటు రైలు అయిన తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ 2019, అక్టోబ‌ర్ 4న ప‌ట్టాలెక్కింది. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటైన ల‌క్నో-ఢిల్లీ-ల‌క్నో (Lucknow-Delhi-Lucknow) మార్గంలో ఇది సేవ‌లు అందిస్తున్న‌ది. ఇత‌ర రైళ్ల‌తో పోలిస్తే ఇందులో టికెట్ల ధ‌ర‌ల అధికంగా ఉంటాయి. అయితే సౌకర్యం, సరైన సమయంలో గమ్యస్థానాలకు చేర్చడం, అత్యాధునిక సేవలు వంటి అత్యద్భుతమైన అనుభవాన్ని ప్రయాణికులకు ఈ రైలు అందిస్తున్న‌ది.

టికెట్ ధ‌ర ఎక్కువే..

ఢిల్లీ-లక్నో మార్గంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కార్ ధర రూ.1679, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధ రూ.2457గా ఉంది. అయితే అదే మార్గంలో ప్ర‌యాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏసీ చైర్ కార్ ధర రూ.1255, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.1955, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏసీ చైర్ కార్ ధర రూ.1255గా ఉండగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.2,415గా ఉంది. ఇక రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ థ‌ర్డ్ టైర్ టికెట్ ధ‌ర రూ.1590, ఏసీ సెకండ్ టైర్ (2ఏ) రూ.2,105, ఏసీ ఫ‌స్ట్ క్లాస్ (1ఏ) టికెట్ ధ‌ర రూ.2,630గా ఉంది.

Advertisement
Advertisement