త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Rao | కేసీఆర్ బావ‌మ‌రిది శ్రీనివాస్‌రావు క‌న్నుమూత‌

Srinivas Rao | బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ (KCR) బావ‌మ‌రిది శ్రీనివాస్ రావు (Srinivas Rao) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

G

Telangana | Published On Aug 13, 2026, 9.10 am IST

Srinivas Rao | కేసీఆర్ బావ‌మ‌రిది శ్రీనివాస్‌రావు క‌న్నుమూత‌
Advertisement

Srinivas Rao | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ (KCR) బావ‌మ‌రిది జోగినపల్లి శ్రీనివాస్ రావు (Srinivas Rao) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంప‌ల్లి స‌మీపంలోని సుచిత్ర జంక్షన్ వద్ద ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన కుమారుడు అమెరికాలో ఉండ‌టంతో అత‌డు వ‌చ్చిన త‌ర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది.

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు (KTR) శ్రీనివాస్ రావు స్వయాన మేనమామ. శ్రీనివాస్ రావు మరణం నేపథ్యంలో ముందుగా నిర్ణ‌యించిన కార్య‌క్ర‌మాల‌ను కేటీఆర్ రద్దు చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. శ్రీనివాస్ భౌతిక‌కానికి నివాళుల‌ర్పించేందుకు యశోద హాస్పిట‌ల్‌కు చేరుకున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement