Indias fertiliser output falls | వార్ ఎఫెక్ట్.. భారత్లో ఐదేళ్ల కనిష్టానికి ఎరువుల ఉత్పత్తి
Indias fertiliser output falls | మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఇంధన రంగంపైనేకాదు.. మన దేశంలో వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా ముడిసరుకుల కొరత ఏర్పడింది. ఫలితంగా మన దేశంలో ఎరువుల ఉత్పత్తి మార్చి నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది (Indias fertiliser output falls).
Indias fertiliser output falls | మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఇంధన రంగంపైనేకాదు.. మన దేశంలో వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎగుమతులు ఆగిపోవడంతో చేతికొచ్చిన పంట పొలాల్లోనే నిలిచిపోయింది. దీంతో అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇక భారతీయ ఉత్పత్తి రంగంపై ఈ వార్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. యుద్ధం కారణంగా ముడిసరుకుల కొరత ఏర్పడింది. ఫలితంగా మన దేశంలో ఎరువుల ఉత్పత్తి మార్చి నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది (Indias fertiliser output falls). ఈ విషయం కేంద్ర వాణిజ్య శాఖ రిలీజ్ చేసిన డేటా ద్వారా వెల్లడైంది.
సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Ministry of Commerce and Industry) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఇండియాలో ఎరువుల ఉత్పత్తి మార్చిలో 24.6 శాతానికి పడిపోయింది. కీలక రంగాల సూచీ (Core Sector Index)లో ఎరువుల వాటా కేవలం 2.63% మాత్రమే. కోర్ సెక్టార్ సూచీలో ఎరువులను మినహాయిస్తే, సూచీ పడిపోకుండా స్థిరంగానే ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 2026లో ఎరువుల ఉత్పత్తి సూచీ 95.7గా నమోదైంది. 2021 ఏప్రిల్ (అప్పుడు 88.3) తర్వాత ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఎనిమిది కీలక రంగాలను ట్రాక్ చేసే కోర్ సెక్టార్ సూచీ ఏడాదికి 0.4 శాతం క్షీణించింది. మార్చిలో సూచీ పడిపోవడానికి ఎరువులు, క్రూడ్ ఆయిల్, బొగ్గు, విద్యుత్ రంగాలు ప్రధానంగా కారణమయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
హర్మూజ్ మూసివేయడంతో..
మన దేశంలో ఎరువుల ఉత్పత్తి రంగంలో యూరియా చాలా ప్రాధానమైంది. దీన్ని నేచురల్ గ్యాస్ ద్వారానే ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. విస్తృతమైన భారతీయ వ్యవసాయ రంగంలో యూరియాను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇంధన సరఫరాకు మూలస్తంభమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జలసంధి గుండా రావాల్సిన సహజ ఇంధన సరఫరాలు పడిపోయాయి. దీని వల్ల ఎరువుల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఫెర్టిలైజర్ ఉత్పత్తికి సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే ఇండియాకు వస్తుంటాయి.
ఫ్యాక్టరీలకు సహజ వాయువు సరఫరా 95% కి పెంపు..
ఎకనామిక్ సర్వే (Economic Survey) ప్రకారం భారత్ తన మొత్తం ఎరువుల వినియోగంలో సుమారు 27 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఇదిలా ఉండగా ఎరువుల ఫ్యాక్టరీలకు అవసరమైన సహజ వాయువు (Natural Gas) సరఫరాను గతంలో 70% నుంచి 90%కి పెంచారు. ఇప్పుడు 90 నుంచి 95 శాతానికి పెంచారు. ఇక మార్చి నెలలో ఎరువుల ఉత్పత్తి 25 శాతానికి తగ్గడానికి ప్రధాన కారణం ప్లాంట్లకు గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా 30 శాతానికి తగ్గించడమే.
ఎరువుల కర్మాగారాలకు సహజ వాయువు (Natural Gas) ఇంధనంగానే కాకుండా ముడిసరుకుగా కూడా పనిచేస్తుంది. వంట అవసరాల కోసం అందించే పీఎన్జీ (PNG), వాహనాల కోసం వాడే సీఎన్జీ (CNG) సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు.. ఎరువుల ప్లాంట్లకు ఇచ్చే గ్యాస్ కోటాను తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్లో గ్యాస్ సరఫరాను తిరిగి పెంచడం వల్ల ఉత్పత్తి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
అంతంతమాత్రంగానే ఇతర రంగాల పరిస్థితి
అదే సమయంలో ఇతర రంగాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బొగ్గు ఉత్పత్తి 4 శాతం తగ్గగా, క్రూడ్ ఆయిల్ 5.7 శాతం పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి కూడా 0.5 శాతం మేర క్షీణించింది. అయితే ఉక్కు, సిమెంట్ రంగాలు పెరుగుదల చూపించినప్పటికీ ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలలో వీటి వేగం గణనీయంగా తగ్గింది. ఉక్కు రంగంలో ఫిబ్రవరిలో 7.6 శాతం వృద్ధి నమోదవగా.. మార్చిలో అది 2.2 శాతానికే పరిమితమైంది. ఇక సిమెంట్ ఉత్పత్తి ఫిబ్రవరిలో 8.9 శాతం పెరగగా, మార్చిలో 4 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది.
Also Read..
వామ్మో అన్ని కోట్లా.?...చిరంజీవి సినిమా కోసం ఏఆర్ రెహమాన్ షాకింగ్ రెమ్యూనరేషన్
భారతీయుల్లో పెరుగుతున్న హీట్ ఫీవర్, హీట్ స్ట్రోక్ సమస్యలు.. జాగ్రత్తలు తప్పనిసరి..
రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు ఎవరికీ మంచిది కాదు: చంద్రబాబుకు పొన్నం లేఖ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Alcohol Prices | యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రంలో పెరుగనున్న మద్యం, బీర్ల ధరలు!
ఏప్రిల్ 6, 2026

LPG Crisis | యుద్ధం ఎఫెక్ట్.. ఎల్పీజీ కొరతతో 50 శాతం మేర పెరిగిన స్ట్రీట్ ఫుడ్స్ ధరలు..
మార్చి 17, 2026

LPG Cylinder | ఎల్పీజీ సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో రూ.6500.. రీఫిల్ కు రూ.3,500..
మార్చి 15, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



