Alcohol Prices | యుద్ధం ఎఫెక్ట్.. రాష్ట్రంలో పెరుగనున్న మద్యం, బీర్ల ధరలు!
Alcohol Prices | ఎక్కడో పశ్చిమాసియాలో (Iran America War) యుద్ధం జరిగితే.. రాష్ట్రంలో మద్యం ధరలు (Alcohol Prices) ఎందుకు పెరుగుతాయని అనుకుంటున్నారా?.. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది.
Alcohol Prices | త్రినేత్ర.న్యూస్: ఎక్కడో పశ్చిమాసియాలో (Iran America War) యుద్ధం జరిగితే.. రాష్ట్రంలో మద్యం ధరలు (Alcohol Prices) ఎందుకు పెరుగుతాయని అనుకుంటున్నారా?.. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. అదే గ్యాస్. న్యాచురల్ గ్యాస్ (Natural Gas) సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో ఒక్కసారిగా ఖర్చులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో గాజు సీసా తయారీ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. పలు యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. ఇది మద్యం సరఫరాలో అంతరాయం సృష్టిస్తున్నది. అసలే ఎండాకాలం, బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ సరఫరా మాత్రం తగ్గిపోయింది. దీనికి తోడు మద్యం ధరల పెంపు గడువు ఇప్పటికే ముగిసిపోయింది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిగా 2023 మే నెలలో ధరలను పెంచగా.. నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్లీ ధరలను సమీక్షించాల్సి ఉంది. దీంతో మద్యం కంపెనీలు ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
సహజవాయువు కొరతతో దేశంలోని ప్రధాన గాజు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి 40 శాతం మేర పడిపోయింది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తాము భరించలేకపోతున్నామని, మద్యం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. మద్యం ధరలను 12-15శాతం వరకు పెంచాలని మద్యం తయారీదారులు అధికారులకు వినతి పత్రం అందించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ధరల పెంపునకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ఓ రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీని కూడా నియమించింది. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా, బీర్ల ధరలను గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వం 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పెంచితే బీర్ల ప్రియుల జేబులకు చిల్లుపడ్డట్టే..!
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



