Mamata Banerjee | బెంగాల్ విజయం తర్వాత.. ఢీల్లీని హస్తగతం చేసుకుంటా.. బీజేపీని తరిమికొడతా : మమతా బెనర్జీ
Mamata Banerjee | బెంగాల్లో బీజేపీకి ఓటమి తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మరోసారి తమ పార్టీ జెండా ఎగురువేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ విజయం తర్వాత ఢిల్లీని టేకోవర్ చేసుకుంటానని స్పష్టం చేశారు. హస్తినలో బీజేపీని గద్దెదించుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- బీజేపీ పతనాన్ని కోరుకుంటున్నా
- బెంగాల్లో వారికి ఓటమి తప్పదు
- నన్ను ఓడించే సత్తా ఎవరికీ లేదు
Mamata Banerjee | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది. బీజేపీ, అధికార తృణమూల్ మధ్య హోరాహోరీ నెలకొంది. ఇరు పార్టీలూ గెలుపే లక్ష్యంగా దూకుడు పెంచాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన దృష్టిని ఢిల్లీపై మళ్లిస్తానని స్పష్టం చేశారు.
కోల్కతాలోని చౌరంగీ (Chowringhee) ప్రాంతంలో జరిగిన ర్యాలీలో దీదీ ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి కేంద్రంలోని బీజేపీని ముక్కలు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "బెంగాల్లో విజయం సాధించిన తర్వాత.. ఢిల్లీపై దృష్టిపెడతా. ఢిల్లీని హస్తగతం చేసుకుంటా. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఢిల్లీలో బీజేపీని గద్దెదించుతా" అని దీదీ వ్యాఖ్యానించారు. తనకు పదవులు, అధికారంపై ఆశ లేదని ఈ సందర్భంగా మమత స్పష్టం చేశారు. రాజధానిలో బీజేపీ పతనాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. బెంగాల్లో వారికి ఓటమి తప్పదు.. అలాగే ఢిల్లీలో కూడా బీజేపీని తరిమికొట్టాలి అని దీదీ ధ్వజమెత్తారు.
అంతేకాదు, బీజేపీ కోసం పనిచేస్తున్న అధికారులు, ఆ పార్టీ కార్యకర్తలపై మమత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న ప్రతీ ఒక్కరి పేర్లు నోట్ చేసుకున్నట్లు చెప్పారు. ఆ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లను అధికారులుగా నియమించుకున్నారని ఆరోపించారు. అయినా తమను ఎవరూ ఏమీ చేయలేరని దీదీ వ్యాఖ్యానించారు. "నన్ను ఓడించే సత్తా ఎవరికీ లేదు. గుర్తు పెట్టుకోండి. బెంగాల్ గడ్డపై మరోసారి జెండా ఎగురవేస్తా. ఆ తర్వాత ఢిల్లీపై దండెత్తుతా. బీజేపీని గద్దె దించుతా" అని మమతా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Also Read..
దీదీ దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్లో బీజేపీ గెలుపు ఖాయం : అమిత్ షా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు
బీజేపీలో చేరడం లేదు.. ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపండి: ప్రీతిరెడ్డి
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



