త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Preethi Reddy meets Chandrashekar Thiwari | బీజేపీలో చేర‌డం లేదు.. ఈ ప్ర‌చారాన్ని ఇంత‌టితో ఆపండి: ప్రీతిరెడ్డి

Preethi Reddy meets Chandrashekar Thiwari | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి కోడ‌లు ప్రీతిరెడ్డి బీజేపీ(BJP)లో చేర‌తార‌న్న వార్త‌లు ఊపందుకున్న‌ వేళ ఆమె వాటికి తెర దించారు. తాను ఆ ఏ పార్టీలో చేర‌డం లేద‌ని చెప్పారు. ఏఐ క్యాంపస్‌(AI campus) ఓపెనింగ్‌కు ప్రధాని మోదీ(PM Modi)ని ఆహ్వానించామ‌ని.. అందుకే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నామ‌ని తెలిపారు.

S

News | Published On Apr 24, 2026, 1.27 pm IST

Preethi Reddy meets Chandrashekar Thiwari | బీజేపీలో చేర‌డం లేదు.. ఈ ప్ర‌చారాన్ని ఇంత‌టితో ఆపండి: ప్రీతిరెడ్డి
Advertisement

Preethi Reddy meets Chandrashekar Thiwari | త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి కోడ‌లు ప్రీతిరెడ్డి బీజేపీ(BJP)లో చేర‌తార‌న్న వార్త‌లు ఊపందుకున్న‌ వేళ ఆమె వాటికి తెర దించారు. తాను ఆ ఏ పార్టీలో చేర‌డం లేద‌ని చెప్పారు. ఏఐ క్యాంపస్‌(AI campus) ఓపెనింగ్‌కు ప్రధాని మోదీ(PM Modi)ని ఆహ్వానించామ‌ని.. అందుకే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నామ‌ని తెలిపారు. బీజేపీనే కాకుండా అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్న‌ట్లు వివ‌రించారు.

శ్రీ‌ధ‌ర్‌బాబును కూడా క‌లిశాం..

ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పిస్తూ బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీలో చేరుతున్నార‌ని రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు తెర లేపింది. ఈ ఊహాగానాల మ‌ధ్య‌ శుక్రవారం ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్‌కు వెళ్ల‌డం, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి(Chandrashekar Thiwari)ని క‌ల‌వ‌డంతో ఆ పార్టీలో చేరడం ప‌క్కా అని అంద‌రూ అనుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నేను బీజేపీలో చేరడం లేదు. ఈ కార్యక్రమం కోసం ఇటీవ‌లే మంత్రి శ్రీధర్‌బాబును కూడా కలిశాం. దయ చేసి ఈ ప్రచారాన్ని ఇంతటితో ఆపండి. ఇది మర్యాదపూర్వక భేటీయే అని ఆమె వెల్ల‌డించారు.

మల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా నడిచింది. ఈ కథనాలపై మల్లారెడ్డి రియాక్ట్ అయ్యారు. త్వరలో మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ యూనివర్సిటీలో దేశంలోనే మొదటి డిజిటల్‌ ఏఐ ఏజెన్సీ క్యాంపస్‌ను గూగుల్‌తో కలిసి ప్రారంభించబోతున్నామ‌ని చెప్పారు. అందుకే ప్రధాని నరేంద్రమోదీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు మల్లారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement