Asaduddin Owaisi | అరుణాచల్లోకి చైనా చొచ్చుకొచ్చిందా..? కేంద్రంపై ఒవైసీ ప్రశ్నల వర్షం
Asaduddin Owaisi | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) డిమాండ్ చేశారు. ఈ మేరకు అరుణాచల్లోకి చైనా (China) చొచ్చుకొచ్చిందా..? మన పెట్రోలింగ్ దళాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను పీఎల్ఏ ధ్వంసం చేసిందా..? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
Asaduddin Owaisi | త్రినేత్ర.న్యూస్ : అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సరిహద్దుల్లో చైనా (China) చొరబడిందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వాన్ని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పష్టత కోరారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. సరిహద్దుల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (Peoples Liberation Army) దురాక్రమణలపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.
సరిహద్దుల్లో మన సైనిక దళాలను పీఎల్ఏ అడ్డుకుంటోందని, ఇప్పటి వరకూ మన సైన్యం గస్తీ తిరిగిన ప్రాంతాలకు వెళ్లకుండా నిరోధిస్తోందని ఆరోపించిన ఒవైసీ.. భారత భూభాగంలో మన పెట్రోలింగ్ దళాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను పీఎల్ఏ ధ్వంసం చేసిందా..? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. మన సైన్యం ఇంతకుముందు గస్తీ తిరిగిన, స్పష్టంగా మన దేశ భూభాగమైన ప్రాంతంలో పీఎల్ఏ బలగాలు టెంట్లు వేసుకున్నాయా..? అని ప్రశ్నించారు.
Because of the continued silence of the @narendramodi government,I again repeat my questions about the situation on the China border in Arunachal Pradesh.
- Did the PLA recently block our army patrols from accessing the area where they had been going so far?
- Did the PLA destroy…— Asaduddin Owaisi (@asadowaisi) August 17, 2026
వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఢిల్లీ పర్యటనకు వీలు కల్పించేందుకు సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొందనే భావన కల్పించడానికి ఆ ప్రాంతంలో గస్తీ హక్కుల కోసం పట్టువద్దని సైన్యంపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందా..? అని ప్రశ్నించారు. 2017లో డోక్లామ్, 2020లో లడఖ్ విషయంలో చేసినట్లుగానే సరిహద్దులో చైనాతో జరుగుతున్న పరిణామాల గురించి తెలియకుండా భారత ప్రజలకు చీకటిలో ఉంచాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుందా..? అంటూ నిలదీశారు. ప్రభుత్వాలు, ప్రధాన మంత్రులు వస్తుంటారు, పోతుంటారని ఒవైసీ వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం అత్యంత పవిత్రమైనవని వాటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
- Is the government pushing the army to not strongly press for patrolling rights to that area because it is keen to portray normalcy to have President Xi Jinping’s visit to Delhi next month?
- Has the Modi government decided to keep the Indian public in the dark about what…— Asaduddin Owaisi (@asadowaisi) August 17, 2026
Also Read..
మోదీ 'దిమాగీ నక్సల్' టు రాహుల్ 'వాట్సప్ యూనివర్సిటీ': ఏలుతున్న హాష్ట్యాగ్స్!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Arunachal Pradesh | చైనా దూకుడుకు భారత్ కౌంటర్.. 27 వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారిక పేర్లు..
ఆగస్టు 8, 2026

Parliament | ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లిన ఉభయసభలు
జులై 31, 2026

Asaduddin Owaisi | యూపీ ఎలక్షన్స్: అఖిలేష్ యాదవ్కు అసదుద్దీన్ ఒవైసీ బంపర్ ఆఫర్.. ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ అంటూ బీజేపీ సెటైర్లు
జులై 26, 2026
తాజావార్తలు
- ●Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి
- ●Oven | ఇంట్లో ఓవెన్ను వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు..
- ●Allu Arjun | అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ లాంఛ్ అప్పుడేనా? - పాన్ ఇండియన్ రేంజ్లో ఈవెంట్!
- ●UP Judge | యూపీ జడ్జి సంచలనం.. నాలుగు నెలల్లోనే 22 మందికి మరణశిక్ష
- ●TTD | తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్.. రేపే ఆర్జిత సేవల టికెట్ల రిలీజ్..!
- ●BJP New National Team | బీజేపీ కొత్త కార్యవర్గం: తెలంగాణకు బిగ్ షాక్.. ఏపీకి మూడు కీలక పదవులు!

Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి

Oven | ఇంట్లో ఓవెన్ను వాడుతున్నారా.. ఈ తప్పులు చేయొద్దు..

Allu Arjun | అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ లాంఛ్ అప్పుడేనా? - పాన్ ఇండియన్ రేంజ్లో ఈవెంట్!

UP Judge | యూపీ జడ్జి సంచలనం.. నాలుగు నెలల్లోనే 22 మందికి మరణశిక్ష



