Delhi Govt | ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ఫ్రం హోం.. సీఎం కీలక ప్రకటన
Delhi Govt | ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక ప్రకటన చేసింది. ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పని వెసులుబాటు కల్పించింది.
Delhi Govt | ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక ప్రకటన చేసింది. ఇంధన ఆదా చర్యల్లో భాగంగా ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పని వెసులుబాటు కల్పించింది. ఇంధన ఆదా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (CM Rekha Gupta) గురువారం ప్రకటించారు. అంతేకాదు, ఇకపై 50 శాతం అధికారిక సమావేశాలు ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేశారు. ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా ఢిల్లీ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఒక రోజును "మెట్రో డే"గా, వారానికి ఒకసారి "నో కార్ డే" పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
కార్పూలింగ్ను అలవాటు చేసుకోండి..
పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు రేఖా గుప్తా సర్కార్ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలను వదిలి.. మెట్రో, బస్సుల్లో ప్రయాణించాలని సూచించింది. మంత్రులు సైతం పొదుపు సూత్రాన్ని పాటించాలని విన్నవించింది. కార్పూలింగ్ను ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించింది. క్షేత్రస్థాయి పర్యటనలు, తనిఖీలు, ప్రారంభోత్సవాల సమయంలో అధికారులు వేర్వేరు వాహనాల్లో వెళ్లకుండా.. ఒకే వాహనాన్ని వాడుకోవాలని చెప్పింది. ప్రయాణాలను మానుకొని.. వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
ఇంధన పొదుపు ప్రజా ఉద్యమంగా మారాలి..
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ శాఖల అధికారులు తమ అధికారిక వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సీఎం రేఖా గుప్తా (CM Rekha Gupta) సూచించారు. ప్రైవేట్ వాహనాలకు బదులుగా బస్సులు, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఇంధన పొదుపు అనేది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనం కోసం మనం పాటించే చిన్నిపాటి నియమాలు పెద్ద మార్పును తీసుకొస్తాయని నొక్కి చెప్పారు.
కాలుష్యం కూడా తగ్గుతుంది..
ఢిల్లీ, రాజధాని ప్రాంతం అంతటా మెట్రో రైళ్లు, డీటీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పెట్రోల్, డీజిల్ చాలా వరకూ ఆదా అవుతుందన్నారు. అంతేకాదు, రాజధానిలో ట్రాఫిక్ రద్దీ, ముఖ్యంగా కాలుష్య స్థాయిలు కూడా గణనీయంగా తగ్గుతాయని సీఎం రేఖా గుప్తా అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అధికారులు, మంత్రులు విదేశీ పర్యటనలను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారిక లేదా వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మంజూరైన విదేశీ పర్యటనల సెలవులను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Also Read..
యూపీలో తుఫాను బీభత్సం.. ఒక్కరోజే 100 మంది మృతి
మూడో దశ సర్పై ఈసీ కీలక ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే..?
ట్యాబ్లెట్తోనే అధిక బరువు తగ్గింపు.. కొత్త వెగోవీ స్టడీ సంచలనం..
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






