త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR | ముసాయిదా ఓట‌ర్ల‌ జాబితా.. కాంగ్రెస్‌ ఎంపీ పేరు మాయం

SIR | భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వివాదాస్ప‌ద‌మ‌వుతున్న‌ది. ఓటర్ల జాబితాను వంద‌ శాతం తప్పులు లేకుండా ప్రక్షాళన చేయడమే దీని లక్ష్యమని ఈసీ చెప్తున్నప్పటికీ.. డ్రాఫ్ట్ జాబితాల్లో ఏకంగా సిట్టింగ్ ఎంపీల పేర్లే మాయ‌మ‌వుతుండ‌టంతో విమ‌ర్శ‌ల‌ప‌ల‌వుతున్న‌ది.

G

National | Published On Sep 4, 2026, 10.23 am IST

SIR | ముసాయిదా ఓట‌ర్ల‌ జాబితా.. కాంగ్రెస్‌ ఎంపీ పేరు మాయం
Advertisement

SIR | త్రినేత్ర‌.న్యూస్‌: భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వివాదాస్ప‌ద‌మ‌వుతున్న‌ది. ఓటర్ల జాబితాను వంద‌ శాతం తప్పులు లేకుండా ప్రక్షాళన చేయడమే దీని లక్ష్యమని ఈసీ చెప్తున్నప్పటికీ.. డ్రాఫ్ట్ జాబితాల్లో ఏకంగా సిట్టింగ్ ఎంపీల పేర్లే మాయ‌మ‌వుతుండ‌టంతో విమ‌ర్శ‌ల‌ప‌ల‌వుతున్న‌ది. ఇటీవ‌ల పంజాబ్‌లో ప్ర‌క‌టించిన ముసాయిదా ఓట‌ర్ల‌ జాబితాలో (Draft Electoral Rolls) రాజ్య‌స‌భ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్ధా (Raghav Chadha)పేరును తొల‌గించ‌డం చ‌ర్చ‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ఎంపీ (Congress MP) పేరుతో ఆయ‌న కుటుంబ స‌భ్యుల పేర్లు కూడా జాబితాలో లేక‌పోవ‌డం రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న‌ది.

ప‌టియాలా కాంగ్రెస్ ఎంపీ డాక్ట‌ర్ ధ‌ర‌మ్‌వీర గాంధీతోపాటు (Dharamvira Gandhi) ఆయ‌న కుటుంబ స‌భ్యుల పేర్లు క‌నిపించ‌కుండా పోయాయి. తాను 2000 సంవ‌త్స‌రం నుంచి ప్ర‌స్తుతం ఉంటున్న చిరునామాలోనే ఉంటున్నాని చెప్పారు. ఇక్క‌డి నుంచే మూడుసార్లు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీచేశానని, రెండుసార్లు గెలుపొందాన‌ని చెప్పారు. ముసాయిదా జాబితాలో త‌నపేరు లేక‌పోవ‌డానికి అధికారుల నిర్ల‌క్ష్యం లేదా సాంకేతిక లోప‌మే కార‌ణ‌మ‌ని చెప్పారు. కాగా, పాస్‌పోర్ట్, 10వ తరగతి సర్టిఫికేట్ వంటి పత్రాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆ తర్వాత తప్పును సరిదిద్దిన అధికారులు ఆయన పేరును జాబితాలో చేర్చారు. అయితే, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె పేర్లను పునరుద్ధరించబడాల్సి ఉంది. అయితే బీఎల్ఓలు వారికి నోటీసులు జారీచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచీ బీజేపీలో చేరిన‌ రాజ్య‌స‌భ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా పేరు క‌నిపించ‌కుండా పోయిన గంట‌ల వ్య‌వ‌దిలోనే ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది.

రాఘ‌వ్ చ‌ద్దా పేరును ‘మరొక ప్రాంతానికి మారినట్లు’ (Shifted) ముసాయిదా జాబితాలో చూపించిన విష‌యం తెలిసిందే. ఇదికాస్తా పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై రాఘవ్ చద్దా స్పందిస్తూ.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌న పేరును తొల‌గించార‌ని చ‌ద్ధా ఆరోపిస్తున్నారు. తాను పంజాబ్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీనని, మొహాలీ పరిధిలో తన ఓటు నమోదై ఉందని స్పష్టం చేశారు. లిస్ట్‌లో త‌న పేరును షిఫ్ట్ అయిన‌ట్లుగా మార్క్ చేయ‌డం చూసి షాక్‌కు గురైన‌ట్లు తెలిపారు. ఇది పొర‌పాటున జ‌రిగింది కాద‌ని.. రాజ‌కీయ క‌క్ష సాధింపులో భాగ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. తాను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి బీజేపీలో చేరినందుకే భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ‌కీయ క‌క్ష సాధింపు కోసం ఎన్నిక‌ల అధికారుల‌ను వాడుకుంటోంద‌ని నిందించారు.

Advertisement
Advertisement