త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jharkhand SIR | జార్ఖండ్‌లో SIR వివాదం.. ఓటర్ల జాబితా నుంచి మైనారిటీల పేర్లు తొలగింపునకు బీజేపీ ఏజెంట్ల ప్రయత్నం

Jharkhand SIR | జార్ఖండ్‌లో చేప‌ట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గొడ్డా జిల్లాలో ఓటర్ల జాబితా నుండి ప‌లువురి పేర్లను తొలగించడానికి బీజేపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) భారీగా 'ఫారమ్-7' దరఖాస్తులను సమర్పించారు. తొల‌గింపు లిస్ట్‌లో అత్య‌ధిక శాతం మైనారిటీ వ‌ర్గానికి చెందిన పేర్లే ఉండ‌టం రాజ‌కీయ దుమారం రేపుతోంది.

D

National | Published On Sep 2, 2026, 2.49 pm IST

Jharkhand SIR | జార్ఖండ్‌లో SIR వివాదం.. ఓటర్ల జాబితా నుంచి మైనారిటీల పేర్లు తొలగింపునకు బీజేపీ ఏజెంట్ల ప్రయత్నం
Advertisement

Jharkhand SIR | త్రినేత్ర‌.న్యూస్ : జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుండి ప‌లువురి పేర్లను తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని కనీసం నాలుగు పోలింగ్ బూత్‌లలో బీజేపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) ఓటర్ల తొలగింపు కోసం భారీగా 'ఫారమ్-7' దరఖాస్తులను సమర్పించారు.

ఓట‌రు జాబితా నుంచి తొలగించమని కోరిన పేర్లలో అత్య‌ధిక శాతం మైనారిటీ వ‌ర్గానికి చెందిన వారివే ఉండ‌టం రాజ‌కీయ దుమారం రేపుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో పనిచేసే బూత్ లెవెల్ అధికారులు (BLOs) ఈ ద‌ర‌ఖాస్తులు స‌రైన ప‌ద్ధ‌తిలో లేవ‌ని వాటిని స్వీక‌రించేందుకు నిరాక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర అస‌హ‌నానికి గురైన BJP ఏజెంట్ ఒక‌రు ఏకంగా 75 ఫారమ్‌లను అక్కడికక్కడే తగులబెట్ట‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

అభ్యంతరాలు తెలపడం చట్టబద్ధమే..

ఇక త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌క‌పోవ‌డంతో బీజేపీ ఏజెంట్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఫారమ్-7 ద్వారా అభ్యంతరాలు తెలపడం చట్టబద్ధమేనని జార్ఖండ్ చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు. BLOలు ఫారమ్‌లను తిరస్కరించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే క్షేత్రస్థాయి పరిశీలన (Field Verification) ద్వారా మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఒక BLA ఎన్ని ఫార‌మ్‌లు స‌మ‌ర్పించొచ్చు..?

ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడానికి లేదా ఎవరైనా చేర్చిన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఫారమ్ 7 ను ఉపయోగిస్తారు. ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం.. ఒక BLA రోజుకు గరిష్టంగా 10 ఫారమ్‌లను మాత్రమే సమర్పించగలరు. అయితే గొడ్డా జిల్లాలోని కొన్ని బూత్‌ల‌లో బీజేపీ ఏజెంట్లు పెద్ద ఎత్తున ఫార‌మ్ 7ల‌ను స‌మ‌ర్పించ‌డం గ‌మనార్హం. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు.

బీజేపీ తీరుపై అధికార పార్టీలు మండిపాటు

ఈ వ్య‌వ‌హారంపై అధికార పార్టీలు తీవ్రంగా స్పందించాయి. మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాను తారుమారు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఓట‌ర్ల జాబితాను తారుమారు చేసేందుకు జ‌రుగుతున్న ఈ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకోవ‌డానికి సుప్రీంకోర్టు త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఓట‌ర్ల‌ జాబితా నుంచి 43.6 ల‌క్ష‌ల మంది ఔట్‌

జార్ఖండ్‌లో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 2.64 కోట్లుగా ఉంది. అయితే, ఇటీవ‌లే నిర్వ‌హించిన స‌ర్ ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 43.6 లక్షల మంది (16.5%) ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితా నుండి తొలగించారు. తొలగించిన వారిలో 7 లక్షల మంది మరణించిన వారు, 14 లక్షల మంది చిరునామా దొరకని వారు (Untraceable), 15 లక్షల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఉన్నారని ఎన్నిక‌ల సంఘం చెబుతోంది.

Also Read..

కృష్ణాష్టమి ఎఫెక్ట్: సెప్టెంబర్ 4న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు బంద్

సంకల్ప సాధకుడు కల్యాణ్‌ బాబు.. తమ్ముడిపై చిరంజీవి ప్రశంసల జల్లు

భారత్ క్రెడిట్ రేటింగ్ పెంపు.. జ‌పాన్ ఏజెన్సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

Advertisement
Advertisement