త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | అలాంటివారికి రెండో ఛాన్స్ ఉండ‌దు.. మంత్రుల‌కు సీఎం విజ‌య్ కీల‌క హెచ్చ‌రిక‌లు

CM Vijay | త‌న కేబినెట్ మంత్రుల‌కు ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay) సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తే మంత్రుల‌ను వెంట‌నే త‌మ ప‌ద‌వుల నుంచి తొల‌గిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

D

National | Published On Jul 16, 2026, 4.15 pm IST

CM Vijay | అలాంటివారికి రెండో ఛాన్స్ ఉండ‌దు.. మంత్రుల‌కు సీఎం విజ‌య్ కీల‌క హెచ్చ‌రిక‌లు
Advertisement

CM Vijay | అవినీతి (corruption) విష‌యంలో త‌న మంత్రుల‌కు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay) కీల‌క హెచ్చ‌రిక‌లు చేశారు. అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తే మంత్రుల‌ను వెంట‌నే త‌మ ప‌ద‌వుల నుంచి తొల‌గిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. చెన్నైలోని (Chennai) స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి విజ‌య్ అధ్య‌క్ష‌త‌న ఇవాళ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మంత్రుల ప‌నితీరు, పార‌ద‌ర్శ‌క‌త‌, అవినీతి నివార‌ణ‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా మంత్రుల‌కు సీఎం విజ‌య్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.

తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మంత్రులు లేదా వారి శాఖ‌ల‌కు సంబంధించి అవినీతి, లంచాలు, అక్ర‌మాల‌పై ఫిర్యాదులు వ‌స్తే స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు. త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఆరోప‌ణ‌లు రుజువైతే ఇక‌ ఏమాత్రం ఆలోచించ‌కుండా సంబంధిత మంత్రిని ప‌ద‌వి నుంచి తొల‌గించేందుకు కూడా వెన‌కాడ‌బోమ‌ని సీఎం గ‌ట్టిగా హెచ్చ‌రించారు.

అవినీతి ర‌హిత పాల‌న అందించేందుకు మంత్రులు క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు. అధికారులు చేసే ప‌నుల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తూ ఎలాంటి అక్ర‌మాల‌కు తావు ఇవ్వ‌కూడ‌ద‌ని సూచించారు. ప్ర‌భుత్వం పూర్తి పార‌దర్శ‌క‌త‌తో ప‌నిచేయాల‌న్న‌దే ల‌క్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు. ఏ చిన్న త‌ప్పు జ‌రిగినా త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. కాగా, అవినీతి నిర్మూలన కోసం విజయ్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ కార్యాలయాల్లో ఎవ‌రైనా లంచం అడిగితే త‌క్ష‌ణ‌మే ఫిర్యాదు చేసేలా వాట్సాప్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లంచం అడ‌గ‌డం, ఇవ్వ‌డం రెండూ నేర‌మేనని తెలియ‌జేస్తూ అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే విధంగా రెండు భాష‌ల్లో నోటీసు బోర్డులను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

Also Read..

హర్మూజ్‌ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీల‌కు కేంద్రం ఆదేశాలు

చ‌ట్ట స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయండి.. టీ పీసీసీ చీఫ్‌కు మ‌హిళా జేఏసీ విజ్ఞ‌ప్తి

స్టాక్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

Advertisement
Advertisement