త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament Monsoon Session | రివ‌ర్స్ ఎటాక్‌.. జార్ఖ్ండ్ నిర‌స‌న‌ల‌పై రాహుల్ స‌మాధానం చెప్పాలి.. ఎన్డీయే ఎంపీల నిర‌స‌న‌

Parliament Monsoon Session | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు (Parliament Monsoon Session) ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మ‌రింత వేడి రాజుకుంది. నీట్ పేప‌ర్ లీక్‌, విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, రామ‌మందిరం విరాళాల చోరీ అంశంపై పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని మ‌క‌ర ద్వారం వ‌ద్ద ప్ర‌తిప‌క్ష ఎంపీలు నిర‌స‌న తెలుపుతుండ‌గా.. ఎన్డీయే ఎంపీలు ప్ర‌తిప‌క్షాల చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీల‌ పోటాపోటీ నినాదాల‌తో పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాస్త ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

D

National | Published On Aug 11, 2026, 12.29 pm IST

Parliament Monsoon Session | రివ‌ర్స్ ఎటాక్‌.. జార్ఖ్ండ్ నిర‌స‌న‌ల‌పై రాహుల్ స‌మాధానం చెప్పాలి.. ఎన్డీయే ఎంపీల నిర‌స‌న‌
Advertisement
  • విద్యార్థుల నిర‌స‌ల‌పై చ‌ర్చ‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది..
  • చ‌ర్చ నుంచి రాహుల్ పారిపోతున్నారు : ఎన్డీయే ఎంపీలు

Parliament Monsoon Session | త్రినేత్ర‌.న్యూస్ : పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు (Parliament Monsoon Session) ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మ‌రింత వేడి రాజుకుంది. నీట్ పేప‌ర్ లీక్‌, విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, రామ‌మందిరం విరాళాల చోరీ అంశంపై పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని మ‌క‌ర ద్వారం వ‌ద్ద ప్ర‌తిప‌క్ష ఎంపీలు నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఎన్డీయే ఎంపీలు సైతం ప్ర‌తిప‌క్షాల చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న చేప‌ట్టారు. విప‌క్షాల‌కు వ్య‌తిరేకంగా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. స‌మావేశాల‌ను స‌జావుగా సాగ‌నీకుండా విప‌క్ష ఎంపీలు అడ్డుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే స‌మ‌యంలో విప‌క్ష ఎంపీలు సైతం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార‌, ప్ర‌తిప‌క్ష ఎంపీల‌ పోటాపోటీ నినాదాల‌తో పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాస్త ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

PM Narendra Modi along with other NDA leaders attend the 'Mangal Milan' meeting (Photo/ANI)

రాహుల్‌.. జార్ఖండ్ వెళ్లండి

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ స‌మావేశం 'మంగళ్ మిలన్' ఇవాళ ఉద‌యం పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఇతర ఎన్డీయే కూట‌మి ఎంపీలు హాజ‌ర‌య్యారు. స‌మావేశం అనంత‌రం ఎంపీలంతా పార్ల‌మెంట్‌లో కొన‌సాగుతున్న ప్ర‌తిష్టంభ‌న‌కు నిర‌స‌న‌గా పార్ల‌మెంట్‌వైపు క‌వాతు నిర్వ‌హించారు. విద్యార్థుల నిరసనలపై చర్చకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. స‌భ‌లో స‌మాధానం ఇచ్చేందుకు అమిత్ షా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్షం పార్లమెంటులో చర్చను తప్పించుకుంటోందని పేర్కొంటూ ఎన్డీయే ఎంపీలు ప్ల‌కార్డులు చేత‌బూని ప్ర‌తిప‌క్షానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ చర్చ నుంచి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారని ఆరోపించారు.

ముఖ్యంగా జార్ఖండ్ రాంచీలో విద్యార్థుల నిర‌స‌న‌ల‌పై ఎన్డీయే ఎంపీలు రాహుల్ గాంధీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ జీ.. జార్ఖండ్‌కు వెళ్లండి అంటూ నిన‌దించారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ అక్క‌డికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ ఎంపీ ముఖేష్ ద‌లాల్ రాహుల్‌కు వ్య‌తిరేకంగా త‌న నినాదాల‌ను కొన‌సాగించారు. స్పందించిన ప్రియాంక‌.. రాహుల్ ఇప్ప‌టికే జార్ఖండ్‌లో నిర‌స‌న చేస్తున్న విద్యార్థుల‌ను క‌లిశార‌ని బ‌దులిచ్చారు.

ఇక విప‌క్ష ఎంపీలు అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగించారు. విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్‌, పెల్లెట్ గ‌న్స్ అంశంపై అమిత్ షా స‌భ‌కు వ‌చ్చి మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు. పోటాపోటీ నినాదాల‌తో పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Also Read..

ఇరాన్ భ‌యం.. తుర్కియే నుంచి బ్రిట‌న్‌కు ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ సాగిందిలా

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ

విస్కీ, టేకిలా పేర్లతో వేరే చోట అమ్మి చూడండి... లీగల్ నోటీస్ ఖాయం! ఎందుకో తెలుసా?

Advertisement
Advertisement