త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saumitra Khan | క‌మ‌లంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Saumitra Khan | తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress ) పార్టీకి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు (Trinamool MLAs), 20 మంది ఎంపీలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఎంపీ సౌమిత్ర ఖాన్ (Saumitra Khan) చేసిన వ్యాఖ్య‌లు బెంగాల్ రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి.

D

National | Published On May 27, 2026, 4.04 pm IST

Saumitra Khan | క‌మ‌లంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Saumitra Khan | బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ (Saumitra Khan) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ (Trinamool Congress ) పార్టీకి చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు (Trinamool MLAs), 20 మంది ఎంపీలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు బెంగాల్ రాజ‌కీయాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. వారంతా పార్టీ నాయ‌క‌త్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని.. బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తే వారంతా కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు రెఢీగా ఉన్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదే జ‌రిగితే తృణ‌మూల్ కాంగ్రెస్ ఒక రాజకీయ శక్తిగా త‌న‌ ఉనికినే కోల్పోతుందని వ్యాఖ్యానించారు.

“బీజేపీ కేంద్ర నాయకత్వం ఓకే చెబితే.. టీఎంసీ అసలు ఒక రాజ‌కీయ‌ పార్టీగానే మిగలదు. ఆ పార్టీలోని నేత‌లంతా దీదీ నాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉన్నారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు మాతో ట‌చ్‌లో ఉన్నారు. వారంతా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.

పాపులు జైలుకెళ్ల‌క త‌ప్ప‌దు..

ఇదే సమయంలో తృణ‌మూల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై సౌమిత్ర ఖన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను ఒక 'పాపి'గా అభివర్ణిస్తూ, పాపం చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి ముందు బుల్డోజర్ సిద్ధంగా ఉందని అన్నారు. 2021లో ఆయ‌న బీజేపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయించినందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఘాటుగా విమర్శించారు. “పాపులు తమ పాపాలకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. వారు నరకానికి పోతారు” అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement