త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్‌ విస్త‌ర‌ణ‌.. మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నితీశ్ కుమార్ త‌న‌యుడు

Bihar Cabinet Expansion | జేడీయూ అధ్యక్షుడు, మాజీ సీఎం నితీశ్ కుమార్‌ తనయుడు నిషాంత్‌ కుమార్‌ (Nishant Kumar).. బీహార్‌లోని సీఎం సమ్రాట్‌ చౌధరి ప్రభుత్వంలో చేరారు. నేడు జ‌రిగిన కేబినెట్ విస్త‌ర‌ణ‌లో నిషాంత్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

D

National | Published On May 7, 2026, 1.13 pm IST

Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్‌ విస్త‌ర‌ణ‌.. మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నితీశ్ కుమార్ త‌న‌యుడు
Advertisement

Bihar Cabinet Expansion | బీహార్ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు, మాజీ సీఎం నితీశ్ కుమార్‌ తనయుడు నిషాంత్‌ కుమార్‌ (Nishant Kumar).. బీహార్‌లోని సీఎం సమ్రాట్‌ చౌధరి ప్రభుత్వంలో చేరారు. నేడు భారీగా ఆ రాష్ట్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ (Bihar Cabinet Expansion) జ‌రిగింది. ఇందులో నిషాంత్‌ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ న‌బిన్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కొత్త‌గా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన మంత్రుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

రికార్డు స్థాయిలో 10 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీయూ అధ్య‌క్షుడు నితీశ్ కుమార్ (Nitish Kumar) రాజ్య‌స‌భ (Rajya Sabha)కు ఎన్నికైన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌దుప‌రి ముఖ్య‌మంత్రి (Bihar CM)గా బీజేపీ నేత సామ్రాట్ చౌద‌రి (Samrat Choudhary) సీఎంగా గ‌త నెల బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే, ఆ స‌మ‌యంలో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఉండ‌టంతో బీజేపీ నేత‌లంతా బిజీగా ఉండ‌టంతో మంత్రివ‌ర్గ‌ విస్త‌ర‌ణకు బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు పూర్తై, ఫలితాలు కూడా వెళ్ల‌డ‌వ‌డంతో.. రాష్ట్రంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టారు. బీజేపీకి 15, జేడీయూకి 13 మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి.

ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ ఇటీవ‌లే జేడీయూలో చేరిన విష‌యం తెలిసిందే. పార్టీలో చేరి రెండు నెల‌ల కూడా కాక‌ముందే ఆయ‌న‌కు మంత్రిప‌ద‌వి ద‌క్క‌డం గ‌మనార్హం. అయితే, ప్ర‌భుత్వంలో చేరేందుకు నిషాంత్ తొలుత నిరాక‌రించార‌ట‌. మంగళవారం జరిగిన జేడీయూ సమావేశంలో సీనియర్ నేతలు ఆయనను ప్రభుత్వంలో చేరేందుకు ఒప్పించినట్టు తెలిసింది. నిషాంత్‌.. ప్రస్తుతం ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, నితీశ్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల ఫీడ్‌బ్యాక్‌ను సేకరించేందుకు పలు జిల్లాల్లో 'బీహార్ గుడ్‌విల్ యాత్ర' చేప‌డుతున్నారు.

Also Read..

మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ సోదాలు.. తొమ్మిదో అంతస్తు నుంచి నోట్ల క‌ట్ట‌లు నిండిన బ్యాగును విసిరేశారు..

త‌మిళ‌నాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు

రాత్రిపూట కీర‌దోస‌ను తిన‌వ‌చ్చా.. వైద్యులు ఏం చెబుతున్నారు..?

Advertisement
Advertisement