త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raju Kumar Singh | వైద్యురాలి మృతి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకి నాలుగేళ్లు జైలు శిక్ష‌

Raju Kumar Singh | గాల్లోకి కాల్పులు జ‌రిపి ఓ వైద్యురాలి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన కేసులో బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాజు కుమార్ సింగ్ (Raju Kumar Singh)కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్లు సాధార‌ణ జైలు శిక్ష విధించింది. శిక్ష‌తోపాటూ రూ.25 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది.

D

National | Published On Jul 4, 2026, 5.59 pm IST

Raju Kumar Singh | వైద్యురాలి మృతి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకి నాలుగేళ్లు జైలు శిక్ష‌
Advertisement

Raju Kumar Singh | బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రాజు కుమార్ సింగ్ (Raju Kumar Singh)కు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. 2018 న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా జ‌రిగిన ఫైరింగ్‌లో (celebratory firing) వైద్యురాలు అర్చ‌నా గుప్తా మృతి చెందిన కేసులో ఆయ‌న్ని దోషిగా తేల్చింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు నాలుగేళ్లు సాధార‌ణ జైలు శిక్ష విధిస్తూ శ‌నివారం తీర్పు ఇచ్చింది. శిక్ష‌తోపాటూ రూ.25 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గొగ్నే ఈ తీర్పు వెలువరించారు. జ‌రిమానా మొత్తాన్ని మృతురాలు అర్చ‌నా గుప్తా కుటుంబానికి ప‌రిహారంగా చెల్లించాల‌ని ఆదేశించారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

2018 డిసెంబరు 31న అర్ధరాత్రి ఢిల్లీలోని ఫతేపూర్ బేరీ (Fatehpur Beri) ప్రాంతంలో ఉన్న రాజు కుమార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో నూతన సంవత్సర వేడుకలు (New Year celebration) నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాజు కుమార్ త‌న లైసెన్స్ గ‌న్‌తో గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ పార్టీకి వ‌చ్చిన అతిథుల్లో ఒక‌రైన అర్చ‌నా గుప్తాకు బుల్లెట్ త‌గలడంతో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ అర్చ‌నా గుప్తా ప్రాణాలు కోల్పోయారు. లైసెన్స్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతోపాటూ ఒక‌రి మ‌ర‌ణానికి కార‌మైనందుకు రాజు కుమార్ సింగ్‌పై కేసు న‌మోదైంది.

ఈ కేసుపై ఢిల్లీ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా రాజు కుమార్ సింగ్ త‌ర‌ఫున న్యాయ‌వాది కోర్టులో వాద‌న‌లు వినిపించారు. ఎమ్మెల్యేకి ఎవరినీ చంపే ఉద్దేశం లేదని.. గతంలోనూ ఆయ‌న‌పై ఎలాంటి నేరచరిత్ర లేదని పేర్కొంటూ ప్రొబేషన్‌పై విడుదల చేయాలని కోరారు. అయితే నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఎమ్మెల్యేకు శిక్ష ఖ‌రారు చేసింది. పండుగ‌లు, వేడుక‌ల స‌మ‌యంలో హర్షధ్వానాల పేరిట జరిపే కాల్పులు ఒక మ‌హ‌మ్మారి లాంటివ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఇవి దేశంలో త‌ర‌చూ ప్రాణ‌న‌ష్టానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని పేర్కొంది.

Advertisement
Advertisement