త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sukesh Chandrashekhar | ఆర్థిక నేర‌గాడు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్‌కు బెయిల్‌.. అయినా జైలులోనే..!

Sukesh Chandrashekhar | రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సరైన కారణాలు లేకుండా దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది.

P

National | Published On Apr 7, 2026, 7.06 pm IST

Sukesh Chandrashekhar | ఆర్థిక నేర‌గాడు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్‌కు బెయిల్‌.. అయినా జైలులోనే..!
Advertisement

Sukesh Chandrashekhar | రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సరైన కారణాలు లేకుండా దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది. ఈ సంద‌ర్భంగా బెయిల్‌కు ప‌లు ష‌ర‌తులు విధించింది. రూ.5ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త బాండ్‌తో పాటు అదే మొత్తంలో మ‌రో ష్యూరిట‌ని స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. కేసులో సాక్షుల‌ను ప్ర‌భావితం చేయ‌డం, వారిని క‌ల‌వ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అడ్ర‌స్‌, మొబైల్ నంబ‌ర్‌ను ద‌ర్యాప్తు అధికారికి అంద‌జేయాల‌ని, పాస్‌పోర్టును కోర్టులో జ‌మ చేయాల‌ని, అనుమ‌తి లేకుండా దేశం విడిచి వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది.

రూ.200కోట్ల మ‌నీలాండ‌రింగ్‌కు సంబంధించిన కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు అత‌ని భార్య లీనా మ‌రియా పాల్ స‌హా ప‌లువురిపై ఎంసీవోసీఏ చ‌ట్టం కింద కేసులు న‌మోద‌య్యాయి. ఏఐఏడీఎంకే నేత టిటివి ధినకరన్‌కు మధ్యవర్తిగా సుకేశ్ వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల గుర్తు పొందేందుకు భారత ఎన్నికల సంఘం అధికారిని లంచం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లుగా కేసు న‌మోదైంది. ఈ సంద‌ర్భంగా రూ.1.3కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. సుకేశ్‌కు బెయిల్ మంజూరైన‌ప్ప‌టికీ వెంట‌నే జైలు వ‌చ్చేందుకు అవ‌కాశం లేదు. మొత్తం 31 క్రిమిన‌ల్ కేసులు అత‌నిపై న‌మోద‌య్యాయి. అందులో 26 కేసుల్లో ఇప్ప‌టికే బెయిల్ మంజూరైంది. మ‌రో ఐదు కేసులు ఇంకా పెండింగ్‌లో ఉండ‌డంతో జైలులోనే ఉండాల్సి రానుంది. ఈ కేసులో బెయిల్ దొరికినా.. జైలు నుంచి విడుద‌ల‌య్యేందుకు మార్గం దొర‌క‌లేదు.

Advertisement
Advertisement