త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | ఎగ్జామ్స్‌లో ‘స్మార్ట్ పెన్’ చీటింగ్.. బీజేపీకి కౌంటర్ ఇస్తూ అసలు గుట్టు విప్పిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ ప్రభుత్వాల హయాంలో ఒక్క పేపర్ లీక్ కాలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. స్మార్ట్ పెన్ తో కాపీ కొట్టే యత్నం మాత్రమే చేశారని కేజ్రీవాల్ అన్నారు.

J

National | Published On Jul 27, 2026, 3.50 pm IST

Arvind Kejriwal | ఎగ్జామ్స్‌లో ‘స్మార్ట్ పెన్’ చీటింగ్.. బీజేపీకి కౌంటర్ ఇస్తూ అసలు గుట్టు విప్పిన అరవింద్ కేజ్రీవాల్
Advertisement
  • ఢిల్లీలో 10 ఏళ్లు, పంజాబ్‌లో 5 ఏళ్ల తమ పాలనలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదన్న కేజ్రీవాల్
  • రెండు సెంటర్లలో స్మార్ట్ పెన్ తో చీటింగ్ చేయబోయిన 10-12 మంది విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని వెల్లడి
  • పేపర్ లీక్ అంటూ ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శ
  • విద్యా రంగంలో కేరళను సైతం వెనక్కి నెట్టి పంజాబ్ నంబర్ వన్ స్థానానికి చేరుకుందని స్పష్టం

Arvind Kejriwal | త్రినేత్ర.న్యూస్ | దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆప్ ప్రభుత్వాల హయాంలో ఒక్క పరీక్ష పేపర్ కూడా లీక్ కాలేదని, ఈ విషయం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆయన మండిపడ్డారు.

స్మార్ట్ పెన్ తో చీటింగ్ ప్లాన్ బస్ట్

తాజాగా జరిగిన ఒక ఎగ్జామ్ లో పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. "రెండు సెంటర్లలో కొందరు విద్యార్థులు ఎవరికీ అనుమానం రాకుండా 'స్మార్ట్ పెన్' (Smart pen) లను లోపలికి తీసుకెళ్లారు. ఆ పెన్ ద్వారా క్వశ్చన్ పేపర్‌ను స్కాన్ చేసి, ఆ ఫోటోలను బయటకు పంపి ఆన్సర్స్ రాబట్టాలని చీటింగ్ (Cheating) కు ప్రయత్నించారు. కానీ, అప్రమత్తమైన అధికారులు ఆ 10-12 మంది విద్యార్థులను స్పాట్ లోనే పట్టుకున్నారు. ఇక్కడ పేపర్ లీక్ కాలేదు, కేవలం కాపీ కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. కానీ వాళ్లు (ప్రతిపక్షాలు) మాత్రం పేపర్ లీక్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు" అని కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు.

కేరళను దాటేసిన పంజాబ్

విద్యా రంగంలో తమ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. "2022లో పంజాబ్‌లో మా ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి.. ఎడ్యుకేషన్ సెక్టార్ (Education sector) లో ఆ రాష్ట్రం 27వ స్థానంలో ఉండేది. కానీ, ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాన్ని సైతం వెనక్కి నెట్టి పంజాబ్ ఏకంగా నంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మేము చేస్తున్న ఇంతటి అద్భుతమైన పనిని చూసి ఓర్వలేక, దానిపై బురద చల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు" అని కేజ్రీవాల్ విమర్శించారు. బీజపీ పాలిత రాష్ట్రాల్లో నిత్యం పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని, తమ ప్రభుత్వాల్లో అలాంటివి జరగకపోవడమే వారికి మింగుడుపడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement