త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Guru Purnima | షిర్డీలో ఘ‌నంగా గురుపౌర్ణ‌మి వేడుక‌లు.. రూ.1.03కోట్ల బంగారు కిరీటాన్ని బ‌హూక‌రించిన ఏపీ భ‌క్తుడు

Guru Purnima | మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆల‌యంలో గురు పౌర్ణ‌మి వేడుక‌లు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల మ‌ధ్య జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా వేకువ జాము నుంచే పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు బాబా ఆల‌యానికి త‌ర‌లివ‌చ్చి ద‌ర్శించుకున్నారు. ఈ వేడుకల నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన భక్తుడు మల్లాడి శ్రీనివాసరావు రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని సాయిబాబాకు సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు.

P

National | Published On Jul 29, 2026, 3.36 pm IST

Guru Purnima | షిర్డీలో ఘ‌నంగా గురుపౌర్ణ‌మి వేడుక‌లు.. రూ.1.03కోట్ల బంగారు కిరీటాన్ని బ‌హూక‌రించిన ఏపీ భ‌క్తుడు
Advertisement

Guru Purnima | మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆల‌యంలో గురు పౌర్ణ‌మి వేడుక‌లు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల మ‌ధ్య జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా వేకువ జాము నుంచే పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు బాబా ఆల‌యానికి త‌ర‌లివ‌చ్చి ద‌ర్శించుకున్నారు. ఈ వేడుకల నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన భక్తుడు మల్లాడి శ్రీనివాసరావు రూ.1.03 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని సాయిబాబాకు సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. 642 గ్రాముల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ కిరీటాన్ని గురుపౌర్ణమి ఉత్సవాల ప్రారంభ రోజున ఆలయ ట్రస్ట్‌కు గురుదక్షిణగా అందజేశారు. ఈ కిరీటంపై శ్రీమహావిష్ణువు దశావతారాల ప్రతిరూపాలను తీర్చిదిద్ద‌డం విశేషం. సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కిరీటాన్ని బాబాకు అలంక‌రించ‌గా.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Sai Baba

Sai Baba

ఈ సందర్భంగా మల్లాడి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయిబాబా నవగ్రహ స్వరూపుడనే తన విశ్వాసంతో ఈ బంగారు కిరీటాన్ని సమర్పించినట్లు తెలిపారు. తన జీవితంలో లభించిన అనుగ్రహానికి కృతజ్ఞతగా ఈ గురుదక్షిణ అర్పించినట్లు పేర్కొన్నారు. శ్రీనివాసరావు తరచూ షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తుంటారని, ఆలయ ట్రస్ట్ చేపట్టే సేవా కార్యక్రమాలకు సైతం విరాళాలు అందిస్తుంటార‌ని ఆల‌య అధికార వ‌ర్గాలు తెలిపాయి. సాయిబాబా ఆస్పత్రితో పాటు భక్తులకు సంబంధించిన ఇతర సౌకర్యాల అభివృద్ధికీ ఆయన స‌హ‌కారం అందిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ సీఈవో గోరక్ష గడిల్కర్ కృతజ్ఞతలు తెలిపారు. గురుపౌర్ణమి సాయిబాబా భక్తులకు అత్యంత పవిత్రమైన ప‌ర్వ‌దిన‌మ‌ని తెలిపారు. గురుపౌర్ణమి వేడుకల సందర్భంగా షిర్డీ ఆలయం భక్తులతో కిట‌కిట‌లాడింది. సాయినామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

Advertisement
Advertisement