త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Air india Plane Crash | విమాన ప్ర‌మాదంలో దెబ్బ‌తిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం

Air india Plane Crash | అహ్మ‌దాబాద్‌లో గ‌తేడాది జ‌రిగిన ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదంలో పూర్తిగా దెబ్బ‌తిన్న బీజే మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని పున‌ర్నిర్మించ‌నున్న‌ట్లు గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

D

National | Published On May 27, 2026, 5.07 pm IST

Air india Plane Crash | విమాన ప్ర‌మాదంలో దెబ్బ‌తిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం
Advertisement

Air india Plane Crash | గ‌తేడాది అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదం (Air india Plane Crash) లో తీవ్రంగా దెబ్బ‌తిన్న బీజే మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని పున‌ర్నిర్మించ‌నున్న‌ట్లు గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అదే స్థ‌లంలో రూ.105 కోట్ల అంచ‌నా వ్య‌యంతో స‌రికొత్త అత్యాధునిక హాస్ట‌ల్ వ‌స‌తిని నిర్మించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్ర‌ఫుల్ ప‌న్షేరియా వెల్ల‌డించారు. గ‌తంలోకంటే మూడు రెట్లు ఎక్కువ వ‌స‌తి సామ‌ర్థ్యంతో దీన్ని పున‌ర్నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. మూడు నెలల్లోనే నిర్మాణ ప‌నులు కూడా ప్రారంభించే అవ‌కాశం ఉంది.

కాగా, గ‌తేడాది జూన్ 12న మ‌ధ్యాహ్నం 1:39 గంట‌ల ప్రాంతంలో అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ బ‌య‌ల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్‌లైన‌ర్ విమానం టేకాప్ అయిన నిమిషాల్లోనే స‌మీపంలోని మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ ప్రాంగ‌ణంలోకి దూసుకెళ్లింది. డైనింగ్ హాల్‌, మెస్ ఏరియాపై విమానం కుప్ప‌కూలిపోయింది. ఆ స‌మ‌యంలో మెస్‌లో భోజ‌నం చేస్తున్న ప‌లువురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు మృతి చెందారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. ప‌లువురు విద్యార్థులు మిస్స‌య్యారు కూడా. ఇక మొత్తం ఈ విమాన ప్ర‌మాదంలో సుమారు 275 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ప్ర‌యాణిస్తున్న ఒకే ఒక వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement