త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Crime | ఢిల్లీలో ఘ‌రానా మోసం.. డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంప‌తుల నుంచి 15 కోట్లు లూటీ

Cyber Crime | ఢిల్లీ (Delhi)లో ఘ‌రానా మోసం (Cyber Crime) చోటు చేసుకుంది. ఓ వృద్ధ వైద్య దంప‌తులు జీవితాంతం క‌ష్ట‌ప‌డి పొదుపు చేసుకున్న రూ.14.85 కోట్ల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు (Cyber Criminals) లూటీ చేశారు. అమెరికాలోని ఐక్య‌రాజ్య‌స‌మితి (United Nations Organisation)లో ప‌నిచేసి, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన డాక్ట‌ర్ ఓం త‌నేజా (Om Taneja), డాక్ట‌ర్ ఇందిరా త‌నేజా (Indira Taneja) దంప‌తులు 2015లో ప‌దవీ విర‌మ‌ణ అనంత‌రం ఢిల్లీలో స్థిర‌ప‌డి సైబ‌ర్ నేరగాళ్ల‌కు చిక్కారు.

A

National | Published On Jan 11, 2026, 3.46 pm IST

Cyber Crime | ఢిల్లీలో ఘ‌రానా మోసం.. డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో వృద్ధ దంప‌తుల నుంచి 15 కోట్లు లూటీ
Advertisement

Cyber Crime | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో ఘ‌రానా మోసం (Cyber Crime) చోటు చేసుకుంది. ఓ వృద్ధ వైద్య దంప‌తులు జీవితాంతం క‌ష్ట‌ప‌డి పొదుపు చేసుకున్న రూ.14.85 కోట్ల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు (Cyber Criminals) లూటీ చేశారు. డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో వ‌ల‌వేసిన మోస‌గాళ్ల దెబ్బ‌కు ఆ వృద్ధులు బ‌ల‌య్యారు. 17 రోజుల పాటు భ‌యం, ఒత్తిడి మ‌ధ్య ఇంటి నుంచి క‌ద‌ల‌కుండా ఉండి, భారీ మొత్తంలో న‌ష్ట‌పోయారు. ఈ ఘాతుకంలో బ‌లైంది 48 ఏళ్ల సుదీర్ఘ స‌మ‌యం అమెరికాలోని ఐక్య‌రాజ్య‌స‌మితి (United Nations Organisation)లో ప‌నిచేసి, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన డాక్ట‌ర్ ఓం త‌నేజా (Om Taneja), డాక్ట‌ర్ ఇందిరా త‌నేజా (Indira Taneja) దంప‌తులు. 2015లో ప‌దవీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం ఢిల్లీకి తిరిగి వ‌చ్చి గ్రేట‌ర్ కైలాష్ ప్రాంతంలో స్థిర‌ప‌డ్డారు. వారి పిల్ల‌లు విదేశాల్లో ఉంటున్నారు.

డిసెంబ‌ర్ 24న వారికి ఊహించ‌ని కాల్ ఒక‌టి వ‌చ్చింది. “మీ నంబర్ నుంచి అసభ్య వీడియోలు, కాల్స్ పంపారట, 26 ఫిర్యాదులు! మనీలాండరింగ్ కేసు, FIRలు.. అరెస్ట్ వారెంట్ జారీ!” అని గట్టిగా చెప్పాడు ఆ వ్యక్తి. ఇందిరా త‌నేజా మనసు తడబడింది. ఎవరితో మాట్లాడాలో, ఎవరిని నమ్మాలో తెలియ‌ని సందిగ్ధ స్థితిలో ప‌డిపోయింది. అంత‌లోనే ట్రాయ్ అధికారి, ఢిల్లీ పోలీస్‌, సీబీఐ అని మ‌రికొన్ని కాల్స్ వ‌చ్చాయి. ఇంట్లోనే ఉండాలి.. బ‌య‌టకు వెళ్తే అరెస్టు అని బెదిరించారు. వీడియో కాల్స్‌లో 24 గంట‌లు ఆన్‌లైన్‌లోనే ఉంచారు. బాత్రూమ్‌కు వెళ్లినా కాల్ క‌ట్ చేయ‌లేదు. ఇలా భ‌యం భ‌యంగా నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు.

నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని సూచించారు. వీడియో కాల్‌లో ఉంటూనే ఇందిరా తనేజా బ్యాంకుకు వెళ్లి ఆర్‌టీజీఎస్ ద్వారా ఒక‌సారి రూ.రెండు కోట్లు, మ‌రోసారి రూ.2.1 కోట్లు, ఇలా మొత్తం ఎనిమిది ఖాతాల‌కు విడ‌త‌ల‌వారీగా రూ.14.85 కోట్లు బ‌దిలీ చేశారు. ఈ నెల 10న ఆ సొమ్మును తిరిగి తీసుకునేందుకు స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాల‌ని సూచించారు. వీడియా కాల్‌లోనే ఉండి, పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన ఆమె ఫోన్ మాట్లాడ‌మ‌ని అక్క‌డ విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసు అధికారికి ఫోన్ అంద‌జేసింది. ఫోన్‌లో మాట్లాడుతున్న అవ‌త‌లి వ్య‌క్తి పోలీసులు దూషించాడు. అప్పుడు తాము మోస‌పోయిన‌ట్లు అర్థ‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీస్ సైబ‌ర్ సెల్ కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టింది.

Advertisement

తాజావార్తలు

Advertisement