All India Pregnant Job | పిల్లలు లేని మహిళలను తల్లిని చేస్తే 10 లక్షల రివార్డు.. ఫేక్ గ్యాంగ్ గుట్టు రట్టు
నవాడాకు చెందిన ఈ గ్యాంగ్ మెయిన్ లీడర్ అయిన రంజన్ కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇలాంటి సైబర్ నేరాలను నవాడా జిల్లాలో వెలుగులోకి తీసుకొచ్చామన్నారు.
All India Pregnant Job | ఈరోజుల్లో పిల్లలు కలగని దంపతులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం నేటి యువతరం అవలంబిస్తున్న జీవన విధానం కావచ్చు.. తీసుకునే ఆహారం కావచ్చు.. ఇలా పలు కారణాల వల్ల చాలామందికి పిల్లలు పుట్టడం లేదు. పిల్లల కోసం చాలామంది మహిళలు ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కడం లేదు. దీన్నే చాన్స్గా తీసుకున్న ఓ గ్యాంగ్.. పిల్లలు లేని యువతులను తల్లిని చేస్తే రూ.10 లక్షలు ఇస్తామని యువకులకు గాలం వేసింది. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి మరీ యువకులను ఇందులోకి లాగింది.
మహిళలను ప్రెగ్నెంట్ చేస్తే డబ్బులు కూడా ఇస్తాం అనే సరికి యువకులు టెంప్ట్ అయిపోయారు. వెంటనే ఆ యాడ్స్కి రెస్పాండ్ అయ్యారు. అయితే.. ఈ ఆఫర్ దక్కాలంటే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని.. ఆ తర్వాత యువతులను హోటల్కి తీసుకెళ్లేందుకు డబ్బులు కట్టాలని, ఆ తర్వాత ఇంకేదో ఫీజు కట్టాలని ఇలా అమాయకపు యువకుల నుంచి లక్షల డబ్బును వసూలు చేసింది గ్యాంగ్. ఆ తర్వాత కానీ అర్థం కాలేదు ఇదంతా ఉత్తదే ఫేక్ అని. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు.
బీహార్లోని నవాడా సైబర్ పోలీసులు ఈ గ్యాంగ్ని పట్టుకున్నారు. యువతులను తల్లిని చేయాలి, లోన్స్ ఇస్తాం, జాబ్స్ ఇస్తాం అంటూ పలు రకాల సోషల్ మీడియా యాడ్స్తో యువతను బోల్తా కొట్టించి రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఫీజులంటూ వాళ్ల దగ్గర్నుంచి డబ్బులు లాగడమే ఈ గ్యాంగ్ చేసే పని.
నవాడాకు చెందిన ఈ గ్యాంగ్ మెయిన్ లీడర్ అయిన రంజన్ కుమార్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇలాంటి సైబర్ నేరాలను నవాడా జిల్లాలో వెలుగులోకి తీసుకొచ్చామని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Bihar Cabinet Expansion | బీహార్లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
మే 7, 2026

KYC | మ్యుచువల్ ఫండ్స్ ఖాతాలో చాలా కాలం నుంచి కేవైసీ అప్ డేట్ చేయలేదా..? అయితే జాగ్రత్త..!
ఏప్రిల్ 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



