త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttar Pradesh | భ‌ర్త ముక్కు కొరికాడ‌ని.. భార్య ప్ర‌యివేటు పార్ట్స్ కొరికేసింది

Uttar Pradesh | భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఇరువురు కొరుక్కునే దాకా దారి తీసింది. భ‌ర్త ముక్కు కొరికాడ‌ని.. భార్య అత‌ని ప్ర‌యివేటు పార్ట్స్ కొరికేసింది.

S

National | Published On Sep 20, 2026, 9.04 am IST

Uttar Pradesh | భ‌ర్త ముక్కు కొరికాడ‌ని.. భార్య ప్ర‌యివేటు పార్ట్స్ కొరికేసింది
Advertisement

Uttar Pradesh | త్రినేత్ర‌.న్యూస్ : భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ఇరువురు కొరుక్కునే దాకా దారి తీసింది. భ‌ర్త ముక్కు కొరికాడ‌ని.. భార్య అత‌ని ప్ర‌యివేటు పార్ట్స్ కొరికేసింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌ర్దోయ్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌ర్దోయ్ జిల్లాకు చెందిన దీప‌క్‌, సాధ‌న‌(27)కు ప‌దేళ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి ముగ్గురు ఆడ పిల్ల‌లు సంతానం. అయితే దీప‌క్ ఫ్రెండ్‌తో సాధ‌న‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. దీంతో నెల‌న్న‌ర క్రితం సాధ‌న త‌న బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిపోయింది. ఇక పిల్ల‌ల‌ను తీసుకువెళ్లేందుకు గురువారం అర్థ‌రాత్రి.. దీప‌క్ ఇంట్లోకి ప్ర‌వేశించింది. సాధ‌న క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించిన దీప‌క్ అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య స్వ‌ల్ప వాగ్వాదం జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

నా ముక్కును కొరికేశాడు..

తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న సాధ‌న త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని పోలీసుల‌కు వివ‌రించింది. దీప‌క్ త‌న ముక్కు కొరికాడ‌ని భార్య ఆరోపించింది. ఆ స‌మ‌యంలో అత్త‌మామ‌లు త‌న చేతుల‌ను, కాళ్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకున్నార‌ని వాపోయింది. ముక్కును స్థానికంగా ఉన్న డ్రైనేజీలో ప‌డేశాడ‌ని ఆమె తెలిపింది.

లేదు లేదు.. నా కుమారుడి ప్ర‌యివేటు పార్ట్స్ కొరికేసింది..

కోడ‌లు మాట‌లు విన్న త‌ర్వాత దీప‌క్ త‌ల్లి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. లేదు లేదు.. ఆమెనే త‌న కుమారుడి ప్ర‌యివేటు పార్ట్స్ కొరికేసింది. ఆ త‌ర్వాత త‌ల‌ను నేల‌కేసి బాదుకుంది. దీంతో ఆమె ముక్కుకు తీవ్ర గాయ‌మై తెగిపోయింద‌ని దీప‌క్ త‌ల్లి ఆరోపించింది.

ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న సాధ‌న‌ను స్థానికంగా ఉన్న ప్రైమ‌రీ హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు పోలీసులు. అనంత‌రం మెరుగైన చికిత్స నిమిత్తం హార్దోయ్ మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

కేసు న‌మోదు

దీప‌క్ త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. సాధ‌న నుంచి ఎలాంటి ఫిర్యాదు అంద‌లేదు అని స్ప‌ష్టం చేశారు పోలీసులు.

Advertisement
Advertisement