త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pilgrims | స్టేష‌నరీ ట్ర‌క్కును ఢీకొట్టిన వ్యాన్‌.. ఆరుగురు భ‌క్తులు దుర్మ‌ర‌ణం

Pilgrims | హ‌ర్యానాలోని ప‌ల్వాల్‌లో (Palwal) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల స‌మ‌యంలో కుండ్లి-మానెస‌ర్‌-ప‌ల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప‌ల్వాల్ వ‌ద్ద స్టేష‌న‌రీ ట్ర‌క్‌ను ఓ పిక‌ప్ వ్యాన్ ఢీకొట్టింది.

G

National | Published On Sep 2, 2026, 5.24 am IST

Pilgrims | స్టేష‌నరీ ట్ర‌క్కును ఢీకొట్టిన వ్యాన్‌.. ఆరుగురు భ‌క్తులు దుర్మ‌ర‌ణం
Advertisement

Pilgrims | త్రినేత్ర‌.న్యూస్‌: హ‌ర్యానాలోని ప‌ల్వాల్‌లో (Palwal) ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. తెల్ల‌వారుజామున 4.30 గంట‌ల స‌మ‌యంలో కుండ్లి-మానెస‌ర్‌-ప‌ల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప‌ల్వాల్ వ‌ద్ద స్టేష‌న‌రీ ట్ర‌క్‌ను ఓ పిక‌ప్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు భ‌క్తులు (Pilgrims) అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 14 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన‌వారిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

బాధితులంతా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని (Uttar Pradesh) మెయిన్‌పురి జిల్లాకు చెందిన‌వారిగా గుర్తించారు. వారంతా రాజ‌స్థాన్‌లోని (Rajasthan) ఖ‌తు శ్యామ్ ఆల‌యాన్ని ద‌ర్శించుకుని.. యూపీలోని వృందావ‌న్‌కు తిరుగుప‌య‌ణ‌మ‌య్యార‌ని, మార్గ‌మ‌ధ్యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నార‌ని చెప్పారు. డ్రైవ‌ర్ నిద్రలోకి జారుకోవ‌డంతో ప్రమాదం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement