త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Haryana | స్కూల్‌లో మొబైల్ ఫోన్ నిషేధం.. టీచ‌ర్‌పై స్క్రూడ్రైవ‌ర్‌తో దాడి

Haryana | ఇటీవ‌లి కాలంలో పుట్టిన బిడ్డ నుంచి మొద‌లుపెడితే పండు ముస‌లి వ‌ర‌కు మొబైల్ ఫోన్ల‌తోనే గ‌డిపేస్తున్నారు. మ‌రి ముఖ్యంగా పాఠ‌శాల విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్ల‌కు బానిస అయ్యారు.

S

National | Published On Jul 21, 2026, 8.32 am IST

Haryana | స్కూల్‌లో మొబైల్ ఫోన్ నిషేధం.. టీచ‌ర్‌పై స్క్రూడ్రైవ‌ర్‌తో దాడి
Advertisement

Haryana | త్రినేత్ర‌.న్యూస్ : ఇటీవ‌లి కాలంలో పుట్టిన బిడ్డ నుంచి మొద‌లుపెడితే పండు ముస‌లి వ‌ర‌కు మొబైల్ ఫోన్ల‌తోనే గ‌డిపేస్తున్నారు. మ‌రి ముఖ్యంగా పాఠ‌శాల విద్యార్థులు కూడా స్మార్ట్ ఫోన్ల‌కు బానిస అయ్యారు. ఈ క్ర‌మంలో త‌మ త‌ర‌గ‌తి గదుల్లోకి దొంగ‌త‌నంగా మొబైల్స్ తీసుకువ‌చ్చి వాటిల్లో మునిగిపోయి పాఠాల‌కు దూర‌మ‌వుతున్నారు. దీంతో చాలా స్కూల్స్ మొబైల్స్ వినియోగంపై నిషేధం విధిస్తున్నాయి. హ‌ర్యానా సిర్సా జిల్లాలోని జ‌మాల్ గ్రామంలోని ప్ర‌భుత్వ సీనియ‌ర్ సెకండ‌రీ పాఠశాల‌లోనూ విద్యార్థుల మొబైల్స్‌పై నిషేధం విధించారు.

అయితే స్కూల్ టీచ‌ర్ సునీల్ బిరాత్.. విద్యార్థుల హోం వ‌ర్క్ త‌నిఖీ చేస్తుండ‌గా ఓ విద్యార్థి వెనుకాల నుంచి వ‌చ్చి ఆ టీచ‌ర్‌పై స్క్రూ డ్రైవ‌ర్‌తో దాడి చేశాడు. టీచ‌ర్ మెడ‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచిన‌ట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ప్ర‌తాప్ చ‌క్ర‌వ‌ర్తి వెల్ల‌డించారు. అనంత‌రం స‌ద‌రు విద్యార్థి పారిపోయిన‌ట్లు పేర్కొన్నారు.

తీవ్ర గాయాల‌పాలైన టీచ‌ర్‌ను చికిత్స నిమిత్తం క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో సిర్సా జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement