త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | ట్ర‌క్కును ఢీకొట్టిన ప్రైవేటు బ‌స్సు.. ఏడుగురు స‌జీవ ద‌హ‌నం

Road Accident | రాజ‌స్థాన్‌లోని (Rajasthan) దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident ) జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై (Delhi-Mumbai expressway) ప్రైవేటు బ‌స్సు ముందు వెళ్తున్న ఓ ట్ర‌క్కును ఢీకొట్టింది.

G

National | Published On Jul 1, 2026, 9.11 am IST

Road Accident | ట్ర‌క్కును ఢీకొట్టిన ప్రైవేటు బ‌స్సు.. ఏడుగురు స‌జీవ ద‌హ‌నం
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: రాజ‌స్థాన్‌లోని (Rajasthan) దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident ) జ‌రిగింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై (Delhi-Mumbai expressway) ప్రైవేటు బ‌స్సు ముందు వెళ్తున్న ఓ ట్ర‌క్కును ఢీకొట్టింది. దీంతో మంట‌లు చెల‌రేగి ఏడుగురు ప్ర‌యాణికులు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. మ‌రో 20 మంది గాయ‌ప‌డ్డారు.

ప్రైవేటు ల‌గ్జ‌రీ స్లీప‌ర్ బ‌స్సు హ‌రిద్వార్ (Haridwar) నుంచి ఇండోర్‌కు (Indore) వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో తెల్ల‌వారుజామున 2 నుంచి 3 గంట‌ల మ‌ధ్య‌ దౌసా జిల్లా కోల్వా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఓ రెస్ట్ ఏరియా స‌మీపంలో ముందు వెళ్తున్న ట్ర‌క్కును ఢీకొట్టింది. దీంతో అదుపుత‌ప్పిన బ‌స్సు.. రోడ్డు ప‌క్క‌నే ఉన్న లోయ‌లోకి దూసుకెళ్లి ప‌డిపోయింది. బ‌స్సు వెనుక భాగంలో చెల‌రేగిన‌ మంట‌లు క్ష‌ణాల్లోనే మొత్తానికి వ్యాపించాయి. ప‌లువురు ప్ర‌యాణికులు బ‌స్సు కిటీకీల అద్దాలు ప‌గుల‌గొట్టి బ‌య‌ట‌కు దూకారు. అయితే ఏడుగురు మాత్రం అందులోనే చిక్కుకుపోవ‌డంతో స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రులు దౌసా జిల్లా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమా లేక డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్ల జరిగిందా అనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు.

Advertisement
Advertisement