Donald Trump | భారత్-పాక్ యుద్ధాన్ని అలా ఆపాను.. మళ్లీ పాతపాటే ఎత్తుకున్న ట్రంప్
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరిలో ఎలాంటి మార్పూ రావడం లేదు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి ప్రకటించుకున్నారు.
International | Published On Jul 3, 2026, 11.35 am IST
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పాతపాటే ఎత్తుకున్నారు. గతేడాది రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానంటూ మరోసారి ప్రకటించుకున్నారు. టారిఫ్ హెచ్చరికతో రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు.
ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆర్థికపరమైన బెదిరింపుల ద్వారా తాను ఒక్కడినే అనేక అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని తెలిపారు. "భారత్-పాక్ సహా నేను ఎనిమిది యుద్ధాలను ఆపాను. దీనిని అందరూ అంగీకరిస్తారు. ఆ ఎనిమిదింటిలో ఐదు యుద్ధాలు కేవలం టారిఫ్ల వల్లే ఆగిపోయాయి" అని ట్రంప్ పేర్కొన్నారు.
"గతేడాది భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఆ రెండూ అణ్వాయుధ దేశాలు కావడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో నేను రంగంలోకి దిగాను. మీరు యుద్ధం కొనసాగిస్తే 200 శాతం టారిఫ్ విధిస్తా అని ఇరు దేశాలను హెచ్చరించాను. ఆ హెచ్చరికలతో రెండు దేశాలూ శాంతించాయి. ఇక ఈ ఘర్షణల్లో 11 యద్ధ విమానాలు కూలిపోయాయి. ఈ యుద్ధం ఆపడం వల్ల మూడు కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగినట్లు పాక్ ప్రధాని షరీఫ్ నాతో చెప్పారు" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
కాగా, గతేడాది మే నుంచి ట్రంప్ వెయ్యి సార్లైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసిఉంటారు. పాక్-భారత్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ ప్రపంచ వేదికగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ.. ట్రంప్ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read..
జులై 5న నా పెళ్లి.. ప్రకటించిన ఆమిర్ ఖాన్
అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భారీ వర్షంలోనూ తరలివెళ్తున్న భక్తులు
బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
సంబంధిత వార్తలు

Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జులై 18, 2026

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
జులై 18, 2026

Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
జులై 18, 2026
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి



