త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sheikh Hasina | డిసెంబ‌ర్‌లో స్వ‌దేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హ‌సీనా కీల‌క ప్ర‌క‌ట‌న‌

Sheikh Hasina | ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో స్వ‌దేశాని (Bangladesh)కి వెళ్ల‌నున్న‌ట్లు బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన మంత్రి (Sheikh Hasina) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అక్క‌డ కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

D

International | Published On Jul 10, 2026, 5.21 pm IST

Sheikh Hasina | డిసెంబ‌ర్‌లో స్వ‌దేశానికి.. లొంగిపోయేందుకు సిద్ధం : షేక్ హ‌సీనా కీల‌క ప్ర‌క‌ట‌న‌
Advertisement

Sheikh Hasina | త్రినేత్ర‌.న్యూస్ : దాదాపు రెండేళ్లుగా ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో తాను తిరిగి స్వ‌దేశానికి వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. అక్క‌డ కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

రాయిట‌ర్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షేక్ హ‌సీనా మాట్లాడుతూ.. "నేను వెళ్ల‌గానే వాళ్లు నన్ను అరెస్టు చేయొచ్చు.. హతమార్చవచ్చు కూడా. అయినా స‌రే నేను స్వ‌దేశానికి వెళ్లి తీరుతా. నా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఒకవేళ మరణం సంభవిస్తే.. అది నా తల్లిదండ్రులను ఖ‌న‌నం చేసిన చోట‌, వారి ర‌క్తం చిందిన నా సొంత గ‌డ్డ‌పైనే చ‌నిపోవాల‌ని కోరుకుంటున్నాను" అని హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ డిసెంబ‌ర్‌లో త‌న పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు, తాను స్వ‌దేశానికి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పారు. అక్క‌డ న్యాయ‌స్థానం ముందు లొంగిపోవాల‌ని అనుకుంటున్న‌ట్లు హ‌సీనా వెల్ల‌డించారు.

కాగా, రిజర్వేషన్ల అంశంలో చెలరేగిన వివాదం కారణంగా.. విద్యార్థుల నిరసనలకు జడిసి 2024 ఆగస్టు 5న ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం బంగ్లానుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. హ‌సీనా దేశం విడిచి వ‌చ్చిన త‌ర్వాత బంగ్లాలో ఆమెపై అనేక కేసులు న‌మోద‌య్యాయి. ఆయా కేసుల‌పై విచారణ జరిపిన బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌.. 2025లో హ‌సీనాకు మరణశిక్ష విధించింది.

Advertisement
Advertisement