త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz | హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ షురూ

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

J

International | Published On Jun 27, 2026, 5.33 pm IST

Strait of Hormuz | హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ షురూ
Advertisement
  • హార్ముజ్ జలసంధిలో పనామా జెండాతో వెళ్తున్న 'కికు' (KIKU) అనే ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని దాడి
  • నౌక బ్రిడ్జి భాగానికి తీవ్ర నష్టం, ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడిన క్రూ మెంబర్స్
  • మిడిల్ ఈస్ట్ వార్ ముగిసిన తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష దాడి ఇదే కావడం గమనార్హం
  • అమెరికా స్థావరాలపై దాడులు చేశామని అధికారికంగా ప్రకటించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్

Strait of Hormuz | త్రినేత్ర.న్యూస్ : మిడిల్ ఈస్ట్ (Middle East) ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. అమెరికా (US), ఇరాన్ (Iran) మధ్య తాజా దాడుల నేపథ్యంలో.. వ్యూహాత్మక ప్రాంతమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో ఓ ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని ప్రొజెక్టైల్‌ (Unknown Projectile)తో దాడి జరిగింది. ఈ ఘటన శనివారం వెలుగులోకి రాగా, అంతర్జాతీయంగా సముద్ర వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది.

దెబ్బతిన్న 'కికు' ట్యాంకర్

బ్రిటన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKMTO) తెలిపిన వివరాల ప్రకారం.. పనామా జెండాతో ప్రయాణిస్తున్న 'కికు' (KIKU) అనే ఆయిల్ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ట్యాంకర్ ముందు భాగంలో ఉండే 'బ్రిడ్జ్' (Bridge) దెబ్బతిన్నప్పటికీ, నౌకలోని క్రూ (Crew) అంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు నిర్ధారించారు. వన్‌గార్డ్ టెక్ (Vanguard Tech) అనే మరో భద్రతా సంస్థ కూడా ఈ దాడికి గురైంది కికు ట్యాంకరే అని ధృవీకరించింది.

భగ్గుమన్న అమెరికా-ఇరాన్ వివాదం

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపేందుకు ఒప్పందం జరిగిన తర్వాత.. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తొలి భారీ ఫైరింగ్ (Exchange of fire) ఇదే కావడం గమనార్హం. ఇటీవల ఇరాన్‌పై అమెరికా దాడులు చేయగా, దానికి ప్రతీకారంగా గల్ఫ్ (Gulf) ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై తాము ఎదురుదాడి చేశామని ఇరాన్ మిలటరీకి చెందిన ఐడియలాజికల్ విభాగం 'రివల్యూషనరీ గార్డ్స్' (Revolutionary Guards) శనివారం అధికారికంగా ప్రకటించింది.

ఓ వైపు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు జరుగుతుండటం, అదే సమయంలో అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement