త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | జ‌ల ప్ర‌ళ‌యం వేళ‌.. టిబెట్‌ను వ‌ణికించిన భారీ భూకంపం

Earthquake | టిబెట్ (Tibet)లో భూకంపం (Earthquake ) సంభ‌వించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 5గా న‌మోదైన‌ట్లు జ‌ర్మ‌న్ రీసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ జియోసైన్సెస్ తెలిపింది.

D

International | Published On Sep 3, 2026, 2.57 pm IST

Earthquake | జ‌ల ప్ర‌ళ‌యం వేళ‌.. టిబెట్‌ను వ‌ణికించిన భారీ భూకంపం
Advertisement

Earthquake | త్రినేత్ర‌.న్యూస్ : నేపాల్‌-టిబెట్ స‌రిహ‌ద్దుల్లో సంభ‌వించిన ఆక‌స్మిక వ‌ర‌ద‌లు ఎంత‌టి విషాదాన్ని మిగిల్చాయో మాట‌ల్లో చెప్ప‌లేం. నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌లో ఒక హిమనీనదం కూలిపోవడం గ‌త నెల 26న వ‌చ్చిన జ‌ల ప్ర‌ళ‌యానికి వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 4 వేల మందికిపైగా ఆచూకీ ఇంకా తెలియ‌రాలేదు. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే భ‌యంతో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్న నేపాల్ వాసుల‌ను భారీ భూకంపం (Earthquake) మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురి చేసింది.

ఇవాళ టిబెట్ (Tibet)లో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 5గా న‌మోదైన‌ట్లు జ‌ర్మ‌న్ రీసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ జియోసైన్సెస్ తెలిపింది. భూమికి 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ ప్ర‌కంప‌న‌ల‌తో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే, ఈ భూకంపం కార‌ణంగా ప్రాణ‌, ఆస్తి న‌ష్టానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి స‌మాచారం లేదు.

కాగా, గ‌త నెల సంభ‌వించిన వ‌ర‌ద‌లు నేపాల్ స‌రిహ‌ద్దు ప‌ట్ట‌ణాలు, లోయ‌ల‌ను అత‌లాకుత‌లం చేశాయి. వ‌ర‌ద విధ్వంసానికి గ్రామాల‌కు గ్రామాలే కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు, వాహ‌నాలు, రోడ్లు, మార్కెట్లు, వంతెన‌లు, జ‌ల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంస‌మ‌య్యాయి. ఈ వ‌ర‌ద‌ల‌కు 1,250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 4,800 మంది ఆచూకీ ఇప్ప‌టికీ తెలియ‌రాలేదు. వీరిలో భార‌తీయులు, ఇత‌ర విదేశీయులు ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌ద ముప్పు ఇంకా తొల‌గిపోలేదు. అక్క‌డ న‌దుల్లో నీటి మ‌ట్టం క్ర‌మంగా పెరుగుతున్న‌ట్లు స్థానిక అధికారులు తెలిపారు. మ‌రోసారి వ‌ర‌ద‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌స్త‌తుం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Also Read..

విమానం గాల్లో ఉండ‌గా ల‌గేజీ స్టోర్ నుంచి పొగ‌లు

సెప్టెంబర్ 7లోగా జీవో 97 రద్దు చేయకుంటే సీఎం ఇంటి ముట్టడే

భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0.. వాహన భద్రతపై గడ్కరీ కీలక ప్రకటన

Advertisement
Advertisement