త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadwal Vijayalakshmi | ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షురాలిగా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి

Gadwal Vijayalakshmi | రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షురాలిగా జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

S

Telangana | Published On Sep 3, 2026, 2.53 pm IST

Gadwal Vijayalakshmi | ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షురాలిగా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి
Advertisement

Gadwal Vijayalakshmi | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షురాలిగా జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. వ‌న‌ప‌ర్తి మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి నిన్న రాత్రి ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ఆయ‌న స్థానంలో గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి ఆ స్థానాన్ని క‌ట్ట‌బెట్టింది రేవంత్ స‌ర్కార్. గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి కేబినెట్ హోదా క‌ల్పించిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా నేరెళ్ల శార‌ద‌

రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా నేరెళ్ల శార‌ద‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ స్థానంలో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. విజ‌య‌ల‌క్ష్మిని ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షురాలిగా నియ‌మించ‌డంతో.. మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి శార‌ద‌ను వ‌రించింది.

కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా గుండు సుధారాణి

కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చైర్‌ప‌ర్స‌న్‌గా రాజ్య‌స‌భ మాజీ స‌భ్యురాలు గుండు సుధారాణి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. సుధారాణి బాధ్య‌త‌లు స్వీక‌రించిన రోజు నుంచి రెండేండ్ల పాటు కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగ‌నున్నారు.

Advertisement
Advertisement