త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | ఇండోనేషియాను కుదిపేసిన అత్యంత శ‌క్తిమంత‌మైన భూకంపం.. ఒక‌రు మృతి

Earthquake | ఇండోనేషియాని (Indonesia) అత్యంత శ‌క్తిమంత‌మైన భూకంపం (Earthquake) కుదిపేసింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 7.6గా న‌మోదైంది.

D

International | Published On Apr 2, 2026, 10.56 am IST

Earthquake | ఇండోనేషియాను కుదిపేసిన అత్యంత శ‌క్తిమంత‌మైన భూకంపం.. ఒక‌రు మృతి
Advertisement

Earthquake | ఇండోనేషియాని (Indonesia) అత్యంత శ‌క్తిమంత‌మైన భూకంపం (Earthquake) కుదిపేసింది. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 7.6గా న‌మోదైంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం గురువారం ఉద‌యం 7:48 గంట‌ల‌కు భూకంపం సంభ‌వించింది. టెర్నెట్ ద్వీపానికి 127 కిలోమీటర్ల దూరంలో మొలుక్కా సముద్రంలో (Molucca Sea) భూకంప కేంద్రం ఉన్న‌ట్లు గుర్తించారు.

ఈ భూకంపం ధాటికి ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. బిటుంగ్, టెర్నేట్ నగరాల్లో కొన్ని సెక‌న్ల‌పాటూ భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి 75 సెం.మీ. ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. ఈ మేర‌కు అధికారులు సునామీ (tsunami) హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్ర‌కంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇండ్ల నుంచి బ‌య‌ట‌కి ప‌రుగులు తీశారు.

Also Read..

అది నా పూర్వ‌జ‌న్మ సుకృతం.. ప్ర‌త్యేక వీడియో షేర్ చేసిన చిరంజీవి

ఐదు మండ‌లాల్లో ఇంటిగ్రేటెడ్ భూభార‌తి పోర్ట‌ల్ సేవ‌లు షురూ..

బాస‌ర ట్రిపుల్ ఐటీలో ప్ర‌వేశాలు.. మే 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు

ట్యాగ్స్:

Advertisement
Advertisement