త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ప్రేమ పేరుతో ద‌గ్గ‌ర‌య్యాడు.. పెండ్లి చేసుకుంటాన‌ని గ‌దికి పిలిచి సామూహిక‌ లైంగిక దాడి

Hyderabad | ప్రేమ పేరుతో వెంబ‌డిప‌డ్డాడు. పెండ్లి కోసం మ‌తం మార్చుకుంటాన‌ని న‌మ్మించాడు. పెళ్లికి ముందే ఇంటికి పిలిచి.. సోద‌రులు, స్నేహితుల‌తో క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. హైద‌రాబాద్ (Hyderabad) కూక‌ట్‌ప‌ల్లిలో జ‌రిగిన విస్తుపోయే ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

G

Hyderabad | Published On Apr 5, 2026, 10.08 am IST

Hyderabad | ప్రేమ పేరుతో ద‌గ్గ‌ర‌య్యాడు.. పెండ్లి చేసుకుంటాన‌ని గ‌దికి పిలిచి సామూహిక‌ లైంగిక దాడి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రేమ పేరుతో వెంబ‌డిప‌డ్డాడు. పెండ్లి కోసం మ‌తం మార్చుకుంటాన‌ని న‌మ్మించాడు. పెళ్లికి ముందే ఇంటికి పిలిచి.. సోద‌రులు, స్నేహితుల‌తో క‌లిసి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. హైద‌రాబాద్ (Hyderabad) కూక‌ట్‌ప‌ల్లిలో జ‌రిగిన విస్తుపోయే ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

షేక్ నవాజ్ అనే వ్యక్తి బాధితురాలైన హిందూ యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. మ‌తం మార్చుకుని పెండ్లి చేసుకుంటాన‌ని ఆమెను ఒప్పించాడు. వివాహానికి ముందే 2025, జూన్‌లో బేగంపేటలోని తన గదికి ఆమెను పిలిపించాడు. అక్కడ ఆమెకు జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత తన సోదరులు, స్నేహితులతో కలిసి నవాజ్ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెండ్లి జరిగిన తర్వాత త‌న అస‌లు రూపం బ‌య‌ట‌పెట్టాడు.

బ‌లవంతంగా ఆమెను ఇస్లాం మతంలోకి మార్చాడు. పెండ్లి త‌ర్వాత కూడా ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. అప్పటికే మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడ‌ని తెలియడంతో మోస‌పోయాడ‌ని గ్ర‌హించింది. రోజురోజుకు వేధింపులు అధిక‌మ‌వ‌డంతో చివరకు ఆమె కూక‌ట్‌ప‌ల్లి పోలీసులను ఆశ్ర‌యించింది. దీంతో నిందితులు షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారుక్, ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదుచేసిన కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు.. తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు.

Advertisement
Advertisement