త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Miyapur Murder Case | ప్రియుడి కోసం భర్తను చంపి శవాన్ని మహారాష్ట్రలో పూడ్చిపెట్టిన భార్య.. మియాపూర్ కేసులో సంచలన నిజాలు

మియాపూర్‌లో దారుణం వెలుగుచూసింది. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా చంపిన భార్య.. బాడీని మహారాష్ట్రలో పూడ్చిపెట్టింది. పోలీసుల విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!

J

Crime | Published On Jul 7, 2026, 6.43 pm IST

Miyapur Murder Case | ప్రియుడి కోసం భర్తను చంపి శవాన్ని మహారాష్ట్రలో పూడ్చిపెట్టిన భార్య.. మియాపూర్ కేసులో సంచలన నిజాలు
Advertisement
  • గతేడాది నవంబర్‌లో భర్త పెంటేశ్ (45) కనిపించడం లేదంటూ భార్య సత్యవతి పోలీసులకు ఫిర్యాదు
  • భోజనంలో నిద్రమాత్రలు కలిపి, దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపిన భార్య
  • శవాన్ని కారులో మహారాష్ట్ర తీసుకెళ్లి, పెట్రోల్ పోసి తగులబెట్టి, అనంతరం పూడ్చిపెట్టిన నిందితులు
  • భార్య కాల్ రికార్డులు (Call records), సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ సంచలన కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు

Miyapur Murder Case | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని మియాపూర్‌లో (Miyapur) ఓ షాకింగ్ క్రైమ్ వెలుగుచూసింది. దృశ్యం సినిమాను తలపించేలా పక్కా ప్లాన్‌తో ఓ ఇల్లాలు ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర బోర్డర్‌కు తీసుకెళ్లి తగులబెట్టి పూడ్చిపెట్టింది. భర్త ఏమయ్యాడో తెలియదంటూ మిస్సింగ్ (Missing) డ్రామా ఆడిన నిందితురాలు ఎట్టకేలకు పోలీసుల దర్యాప్తులో అడ్డంగా దొరికిపోయింది.

నిద్రమాత్రలు ఇచ్చి.. ఊపిరి తీసి

పోలీసుల కథనం ప్రకారం.. గతేడాది నవంబర్‌లో పెంటేశ్ (45) అనే వ్యక్తి కనిపించడం లేదంటూ అతని భార్య సత్యవతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. భార్య సత్యవతి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె కాల్ రికార్డులు (Call records), చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్‌ (CCTV Footage) ను నిశితంగా పరిశీలించారు. ఈ విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి సత్యవతే స్వయంగా భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఓ రోజు రాత్రి భర్త భోజనంలో నిద్రమాత్రలు (Sleeping pills) కలిపిన సత్యవతి.. అతడు గాఢ నిద్రలోకి జారుకున్నాక ముఖంపై దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేసింది.

మహారాష్ట్ర అడవుల్లో పెట్రోల్ పోసి..

హత్య అనంతరం శవాన్ని మాయం చేసేందుకు ప్రియుడితో కలిసి సత్యవతి మాస్టర్ ప్లాన్ వేసింది. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని కారులో మహారాష్ట్ర సరిహద్దులకు తీసుకెళ్లారు. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఆ తర్వాత ఆనవాళ్లు దొరకకుండా అక్కడే గోతితీసి పూడ్చిపెట్టారు. కొన్నాళ్లకు స్థానికుల సమాచారంతో ఆ కాలిన మృతదేహాన్ని గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు.. తొలుత గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

ఎట్టకేలకు బయటపడ్డ శవం

మరోవైపు మియాపూర్ పోలీసుల (Miyapur Police) దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులతో మియాపూర్ పోలీసులు సమన్వయం చేసుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మహారాష్ట్ర బోర్డర్‌లో పూడ్చిపెట్టిన పెంటేశ్ మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. వివాహేతర సంబంధం (Extramarital affair) మోజులో పడి భర్తను కిరాతకంగా చంపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement