Ebola | హైదరాబాద్లో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు.. గాంధీ దవాఖానలో చికిత్స
Ebola | హైదరాబాద్లో ఎబోలా కలకలం (Ebola Virus) కొనసాగుతున్నది. ఎబోలా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య రెండుకు చేరింది. దీంతో వారికి సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో (Gandhi Hospital) చికిత్స అందిస్తున్నారు.
Ebola | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్లో ఎబోలా కలకలం (Ebola Virus) కొనసాగుతున్నది. ఎబోలా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య రెండుకు చేరింది. దీంతో వారికి సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో (Gandhi Hospital) చికిత్స అందిస్తున్నారు. ఎబోలా (Ebola) హిస్టరీ ఉన్న సూడాన్ దేశానికి చెందిన అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. స్క్రీనింగ్ సమయంలో అతనికి ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని గాంధీలో ఏర్పాటు చేసిన ఎబోలా ఐసోలేషన్ వార్డుకు తరలించిన విషయం తెలిసిందే.
తాజాగా మహమ్మద్ యగౌచ్ అహ్మద్ అనేక వ్యక్తి వ్యాధి లక్షణాలతో గాంధీలో ఆస్పత్రిలో చేరారు. మహమ్మద్ నగరంలోనే చదువుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ సూడాన్ నుంచే వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. బాధితులకు తీవ్రమైన జ్వరం ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రొటోకాల్ ప్రకారం వారి రక్తం, లాలాజలం నమూనాలను సేకరించి నగరంలోని సీసీఎంబీ ల్యాబోరేటరీకి పంపించారు. ఈ నివేదికలు రావడానికి 24 నుంచి 48 గంటలు పట్టే అవకాశం ఉంది. ఇక్కడ పాజిటివ్ అని తేలితే, మరోసారి ధృవీకరణ కోసం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి శాంపిల్స్ పంపించనున్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | నీటిని ఆదా చేయండి.. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
జూన్ 5, 2026

Free MMTS Travel | ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ఆ షరతులకు అంగీకరిస్తేనే!
జూన్ 5, 2026

Rapido Driver | ర్యాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి.. డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు..
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | నీటిని ఆదా చేయండి.. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..
- ●Tirumala | మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 లక్షల మందికిపైగా భక్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?
- ●10th Supplementary Exams | నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..
- ●Revised Land Rates | అమల్లోకి పెరిగిన భూముల విలువలు.. ఎకరాకు కనిష్ఠం రూ.2.75 లక్షలు.. గరిష్ఠం రూ.35 కోట్లు
- ●Gas Cylinder Explosion | ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురు సజీవ దహనం

Ponnam Prabhakar | నీటిని ఆదా చేయండి.. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

Stock Markets | భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా పెరిగిన చమురు ధరలు..

Tirumala | మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 25 లక్షల మందికిపైగా భక్తులు.. హుండీ ఆదాయం ఎంతంటే?

10th Supplementary Exams | నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు..



