త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ebola | హైద‌రాబాద్‌లో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు.. గాంధీ ద‌వాఖాన‌లో చికిత్స

Ebola | హైద‌రాబాద్‌లో ఎబోలా క‌ల‌క‌లం (Ebola Virus) కొన‌సాగుతున్న‌ది. ఎబోలా వ్యాధి సోకిన‌ట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య రెండుకు చేరింది. దీంతో వారికి సికింద్రాబాద్‌లోని గాంధీ ద‌వాఖాన‌లో (Gandhi Hospital) చికిత్స అందిస్తున్నారు.

G

Telangana | Published On Jun 5, 2026, 8.53 am IST

Ebola | హైద‌రాబాద్‌లో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు.. గాంధీ ద‌వాఖాన‌లో చికిత్స
Advertisement

Ebola | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో ఎబోలా క‌ల‌క‌లం (Ebola Virus) కొన‌సాగుతున్న‌ది. ఎబోలా వ్యాధి సోకిన‌ట్లు అనుమానిస్తున్న వారి సంఖ్య రెండుకు చేరింది. దీంతో వారికి సికింద్రాబాద్‌లోని గాంధీ ద‌వాఖాన‌లో (Gandhi Hospital) చికిత్స అందిస్తున్నారు. ఎబోలా (Ebola) హిస్ట‌రీ ఉన్న సూడాన్ దేశానికి చెందిన అబ్దుల్ మ‌జీద్ అనే వ్య‌క్తి గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చారు. స్క్రీనింగ్ స‌మ‌యంలో అత‌నికి ఎబోలా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే అత‌డిని గాంధీలో ఏర్పాటు చేసిన ఎబోలా ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే.

తాజాగా మహమ్మద్​ యగౌచ్​ అహ్మద్​ అనేక వ్యక్తి వ్యాధి లక్షణాలతో గాంధీలో ఆస్పత్రిలో చేరారు. మహమ్మద్ నగరంలోనే చదువుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ సూడాన్​ నుంచే వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. బాధితుల‌కు తీవ్ర‌మైన జ్వ‌రం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. ప్రొటోకాల్ ప్ర‌కారం వారి ర‌క్తం, లాలాజ‌లం న‌మూనాల‌ను సేక‌రించి న‌గ‌రంలోని సీసీఎంబీ ల్యాబోరేట‌రీకి పంపించారు. ఈ నివేదిక‌లు రావ‌డానికి 24 నుంచి 48 గంట‌లు ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ పాజిటివ్ అని తేలితే, మ‌రోసారి ధృవీక‌ర‌ణ కోసం పుణెలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి శాంపిల్స్ పంపించ‌నున్నారు.

 

Advertisement
Advertisement