త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ఆటో డ్రైవ‌ర్ హ‌త్య‌.. హైడ్రా స‌హాయంతో స‌రూర్‌న‌గ‌ర్ చెరువులో క‌త్తి వెలికితీత‌

Hyderabad | సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో మ‌హ‌మ్మ‌ద్ ఫాసి అహ్మ‌ద్ అమీర్(21) అనే యువ‌కుడు దారుణ హ‌త్యకు గురైన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య కేసులో నిందితుడు ఆటో డ్రైవ‌ర్ ఎండ్రావ‌త్ సుమ‌న్‌(21)ను పోలీసులు అరెస్టు చేశారు.

S

Hyderabad | Published On Aug 7, 2026, 2.42 pm IST

Hyderabad | ఆటో డ్రైవ‌ర్ హ‌త్య‌.. హైడ్రా స‌హాయంతో స‌రూర్‌న‌గ‌ర్ చెరువులో క‌త్తి వెలికితీత‌
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో మ‌హ‌మ్మ‌ద్ ఫాసి అహ్మ‌ద్ అమీర్(21) అనే యువ‌కుడు దారుణ హ‌త్యకు గురైన విష‌యం తెలిసిందే. ఈ హ‌త్య కేసులో నిందితుడు ఆటో డ్రైవ‌ర్ ఎండ్రావ‌త్ సుమ‌న్‌(21)ను పోలీసులు అరెస్టు చేశారు. అమీర్‌ను హ‌త్య చేసేందుకు వినియోగించిన క‌త్తిని స‌రూర్‌న‌గ‌ర్ చెరువులో స్వాధీనం చేసుకున్నారు.

అయితే పాత‌క‌క్ష‌ల కార‌ణంగా.. ఆగ‌స్టు 6న అమీర్‌పై సుమ‌న్ కొబ్బ‌రి బొండాల క‌త్తితో న‌డిరోడ్డుపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంత‌రం సుమ‌న్ స‌రూర్ న‌గ‌ర్ చెరువు వైపు ఆటోలో వెళ్లి.. క‌త్తిని అక్క‌డ ప‌డేశాడు. సాక్ష్యాధారాలు ఎవ‌రికీ ల‌భించొద్ద‌నే ఉద్దేశంతోనే క‌త్తిని చెరువులో ప‌డేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తెలిపారు.

నిందితుడి నుంచి ర‌క్త‌పు మ‌ర‌క‌లున్న దుస్తులు, ఆటో, మొబైల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా స‌హాయంతో స‌రూర్‌న‌గ‌ర్ చెరువు నుంచి క‌త్తిని వెలికితీశారు. నిందితుడిని కోర్టులో హాజ‌రు ప‌రిచారు. అనంత‌రం 14 రోజుల రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement
Advertisement