Revanth Reddy | దసరాకు గుర్తురాలేదా రేవంతూ.. మండిపడుతున్న తెలంగాణ వాదులు
Revanth Reddy | సంక్రాంతి (Sankranti) కి వాహనాలలో ఊరెళ్లేవారికి టోల్ ఫీజు (Toll Fee) మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) నిర్ణయంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. మూడు నెలల క్రితం వచ్చిన దసరా (Dasara) పండుగకు టోల్ మినహాయింపు ఇవ్వాలని గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఖజానా ఖాళీగా ఉందంటున్న రేవంత్.. ఈ సొమ్ములు ఎక్కడి నుంచి చెల్లిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy | సంక్రాంతి (Sankranti) కి వాహనాలలో ఊరెళ్లేవారికి టోల్ ఫీజు (Toll Fee) మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి (CM) రేవంత్రెడ్డి (Revanth Reddy) నిర్ణయంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. మూడు నెలల క్రితం వచ్చిన దసరా (Dasara) పండుగకు టోల్ మినహాయింపు ఇవ్వాలని గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఖజానా ఖాళీగా ఉందంటున్న రేవంత్.. ఈ సొమ్ములు ఎక్కడి నుంచి చెల్లిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్ ఫీజు మినహాయింపు అసలు ఎవరు అడిగారని దుయ్యబడుతున్నారు.
కోసుకుతిన్నా రూపాయిలేదు..
రాష్ట్ర ఆర్థిక స్థితిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి తనను కోసుకుతిన్నా రూపాయిలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని చెప్పారు. సచివాలయంలో లంకెబిందెలుంటాయనుకుంటే ఖాళీ బిందెలు దర్శనమిచ్చాయని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారని.. ఎవరూ రానీవడం లేదని, చెప్పులు ఎత్తుకుపోయేవాళ్లలాగా చూస్తున్నారని మరొక సందర్భంలో వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు టోల్ ఫీజు మినహాయింపుకు రూ.కోట్లు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో గ్రామగ్రామానా దసరా వేడుకలు..
సాధారణంగా తెలంగాణలో ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ దసరా. బతుకుతెరువు కోసం ఎక్కడెక్కడో స్థిరపడిన ప్రజలు సైతం తమ స్వంత గ్రామాలకు చేరుకుంటారు. దీంతో గ్రామాలు బతుకమ్మ, దసరా పండుగల రోజు కళకళలాడుతుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు దసరా పండుగలు జరుపుకున్నప్పటికీ ఆ దిశగా ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించకపోవడంపై తెలంగాణ వాదులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి అనేవి తెలంగాణకు పీడదినాలు..
సాధారణంగా సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. తెలంగాణలో దసరా ఎంత అట్టాహాసంగా జరుపుకుంటారో అక్కడి ప్రజలు కూడా అదే స్థాయిలో సంక్రాంతి పండుగ వేడుకలు చేసుకుంటారు. తెలంగాణ ప్రజలు సంక్రాంతి పండుగకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. పైపెచ్చు తెలంగాణలో సంక్రాంతి రోజులను పీడదినాలుగా భావిస్తుంటారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
తిరుపతికి వెళ్లే ముందు మీడియాకు లీకులు..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వెంకటేశ్వరస్వామి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తూ టోల్ఫీజు మినాయింపుపై మీడియాకు లీకులు వదిలి వెళ్లారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముందుగా ఈ సమాచారం లీక్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. టోల్ ఫీజు మినహాయింపు గురించి ఎవరు అడిగారని ప్రభుత్వం ఇంత ఆంధ్రాభిమానం చూపుతుందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వం కాదని, ఆంధ్రా అధికారం నడుస్తున్నదని మండిపడుతున్నారు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ టోల్ కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందా స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



