త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Student | కానూరులో నీట్ కోచింగ్‌.. కుటుంబానికి దూరంగా ఉండ‌లేక‌ హైదరాబాద్ యువ‌తి బలవన్మరణం

NEET Student | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా కానూరులో నీట్ శిక్ష‌ణ (NEET Student) పొందుతున్న హైద‌రాబాద్ (Hyderabad) యువతి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. మూడు వారాల క్రిత‌మే అక్క‌డికి వెళ్లిన విద్యార్థి అంత‌లోనే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెంద‌డం గ‌మ‌నార్హం.

G

Hyderabad | Published On Aug 6, 2026, 1.11 pm IST

NEET Student | కానూరులో నీట్ కోచింగ్‌.. కుటుంబానికి దూరంగా ఉండ‌లేక‌ హైదరాబాద్ యువ‌తి బలవన్మరణం
Advertisement

NEET Student | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా కానూరులో నీట్ శిక్ష‌ణ (NEET Student) పొందుతున్న హైద‌రాబాద్ (Hyderabad) యువతి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. మూడు వారాల క్రిత‌మే అక్క‌డికి వెళ్లిన విద్యార్థి అంత‌లోనే బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెంద‌డం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్ బేగంపేట‌కు చెందిన కంతేటి వైష్ణ‌వి (19).. నీట్ లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్ కోసం కానూరులోని శ్రీ భార‌తి ఇన్‌స్టిట్యూట్‌లో మూడు వారాల క్రితం చేరింది. ఇటీవ‌లే ఇంటికి వ‌చ్చిన ఆమె.. రెండు రోజుల క్రిత‌మే మ‌ళ్లీ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లింది. అయితే కుటుంబానికి దూరంగా ఉండి చ‌దువుకోవ‌డం ఇష్టంలేని వైష్ణ‌వి.. ఇంత దూరంలో ఉండి చదవలేనంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన తన బాధను చెప్పుకుంది. అయితే బిడ్డ భవిష్యత్తు బాగుండాలని భావించిన తల్లిదండ్రులు ఆమెకు సర్దిచెప్పారు. ఇంతలోనే త‌న‌కు ఆరోగ్యం బాగాలేద‌ని కాలేజీకి వెళ్ల‌కుండా హాస్టల్ రూమ్‌లోనే (Coaching Hostel) ఉండిపోయిన ఆమె.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వద‌వాఖాన‌కు త‌ర‌లించారు. యువతి మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. చదువు కోసం వెళ్లిన తమ బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. త‌ల్లిదండ్రుల‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు న‌మోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement