త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | క్యాబ్‌లో ప‌ర్సు మ‌ర్చిపోయిన ప్ర‌యాణికుడు.. తీరా చూస్తే అకౌంట్‌లో నుంచి రూ.31 వేలు విత్‌డ్రా

Hyderabad | ఓ వ్య‌క్తి ఊబ‌ర్ క్యాబ్‌లో (Uber Cab) ఎక్కారు. త‌న గ‌మ్య‌స్థానికి చేరుకున్న త‌ర్వాత దిగి వెళ్లిపోయారు. అయితే క్యాబ్‌లోనే త‌న ప‌ర్సు మ‌ర్చిపోయారు. మ‌రుస‌టి రోజు అత‌ని డెబిట్ కార్డు (Debit Card) ద్వారా ఏటీఎంల నుంచి రూ.31 వేల న‌గ‌దు డ్రా చేసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో (Hyderabad) జ‌రిగింది.

G

Hyderabad | Published On Aug 6, 2026, 6.53 am IST

Hyderabad | క్యాబ్‌లో ప‌ర్సు మ‌ర్చిపోయిన ప్ర‌యాణికుడు.. తీరా చూస్తే అకౌంట్‌లో నుంచి రూ.31 వేలు విత్‌డ్రా
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: ఓ వ్య‌క్తి ఊబ‌ర్ క్యాబ్‌లో (Uber Cab) ఎక్కారు. త‌న గ‌మ్య‌స్థానికి చేరుకున్న త‌ర్వాత దిగి వెళ్లిపోయారు. అయితే క్యాబ్‌లోనే త‌న ప‌ర్సు మ‌ర్చిపోయారు. మ‌రుస‌టి రోజు అత‌ని డెబిట్ కార్డు (Debit Card) ద్వారా ఏటీఎంల నుంచి రూ.31 వేల న‌గ‌దు డ్రా చేసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో (Hyderabad) జ‌రిగింది.

పెద్ద‌ప‌ల్లి స‌మీపంలోని సుర‌భికాల‌నీలో నివ‌సించే ఇంజినీర్ బీవీ విజ‌యేంద‌ర్ కుమారుడు భాగ్య‌న‌గ‌ర్ వెంక‌ట‌సాయి ఈ నెల 3న ఊబ‌ర్ క్యాబ్‌లో హ‌ఫీజ్‌పేట మ‌దీనాగూడ నుంచి బంజారాహిల్స్ (Banjara hills) జింఖా క్ల‌బ్‌కు వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో ప‌ర్సును (Purse) వాహ‌నంలోనే మ‌రిచిపోయారు. అందులో న‌గ‌దు, ఫ్లాట్ తాళం చెవి, బ్యాంకు కార్డులు, ఆధార్ కార్డు వంటి ఇత‌ర‌ ప‌త్రాలు ఉన్నాయి. మ‌రుస‌టి రోజు అంటే ఆగ‌స్టు 4న అత‌ని ఎస్‌బీఐ డెబిట్ కార్డు నుంచి కంచన్‌బాగ్‌, సుల్తాన్‌బ‌జార్ ప్రాంతాల్లోని ఏటీఎం (ATM) నుంచి రూ.31 వేల న‌గ‌దు తీసుకున్నారు. అనంత‌రం చేసిన మ‌రికొన్ని లావాదేవీలు విఫ‌ల‌మ‌య్యాయి. డ‌బ్బులు విత్‌డ్రా అయినట్లు అత‌ని ఫోన్‌కి మెసేజ్ రావ‌డంతో.. బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement