త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం

Vinayaka Chavithi | ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 14న వినాయ‌క చ‌వితి, 25న నిమజ్జ‌నం నేప‌థ్యంలో.. గ‌ణేశ్ ఉత్స‌వాల‌ను స‌జావుగా, శాంతియుతంగా నిర్వ‌హించేందుకు చేసిన ఏర్పాట్ల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ గురువారం స‌మీక్షించారు.

S

Hyderabad | Published On Aug 20, 2026, 3.22 pm IST

Vinayaka Chavithi | సెప్టెంబర్ 14న చవితి.. 25న నిమజ్జనం
Advertisement

Vinayaka Chavithi | త్రినేత్ర‌.న్యూస్ : ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 14న వినాయ‌క చ‌వితి, 25న నిమజ్జ‌నం నేప‌థ్యంలో.. గ‌ణేశ్ ఉత్స‌వాల‌ను స‌జావుగా, శాంతియుతంగా నిర్వ‌హించేందుకు చేసిన ఏర్పాట్ల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ గురువారం స‌మీక్షించారు. జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి అద‌న‌పు క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్, హెచ్‌వోడీలు హాజ‌ర‌య్యారు.

గ‌ణేశ్ విగ్ర‌హాల ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాలు, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుధ్యం, లైటింగ్, విద్యుత్ సరఫరా, వైద్య సౌకర్యాలు, అత్యవసర ప్రతిస్పందనతో పాటు ప్రజా భద్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా చ‌ర్చించారు.
బాలాపూర్ గణేష్ ఊరేగింపు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాల‌ని ఆదేశించారు. రోడ్లు, బారికేడింగ్, క్రేన్లు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, అత్యవసర సేవలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

నిమ‌జ్జ‌న ప్ర‌క్రియ పర్యవేక్షణకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయ‌నున్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, ట్యాంక్ బండ్ వద్ద ఒక కంట్రోల్ రూమ్‌తో పాటు, ప్రధాన సరస్సులు, చెరువులు, నిమజ్జన ప్రదేశాల వద్ద మొబైల్ క్రేన్‌లను కూడా ఏర్పాటు చేస్తారు.

Advertisement
Advertisement