త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG Exam | సైబ‌రాబాద్ ప‌రిధిలో నేటి నుంచి క‌ర్ఫ్యూ.. జ‌ర జాగ్ర‌త్త‌..!

NEET UG Exam | సైబ‌రాబాద్ పోలీసు క‌మిషన‌రేట్ ప‌రిధిలో జూన్ 19 నుంచి 21వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించిన‌ట్లు సీపీ ఎం ర‌మేశ్ వెల్ల‌డించారు. జూన్ 21న నీట్ యూజీ ప్ర‌వేశ ప‌రీక్ష నేప‌థ్యంలోనే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Jun 19, 2026, 3.22 pm IST

NEET UG Exam | సైబ‌రాబాద్ ప‌రిధిలో నేటి నుంచి క‌ర్ఫ్యూ.. జ‌ర జాగ్ర‌త్త‌..!
Advertisement

NEET UG Exam | త్రినేత్ర‌.న్యూస్ : సైబ‌రాబాద్ పోలీసు క‌మిషన‌రేట్ ప‌రిధిలో జూన్ 19 నుంచి 21వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించిన‌ట్లు సీపీ ఎం ర‌మేశ్ వెల్ల‌డించారు. జూన్ 21న నీట్ యూజీ ప్ర‌వేశ ప‌రీక్ష నేప‌థ్యంలోనే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌న్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్ష‌న్ 163 కింద క‌ర్ఫ్యూ విధించిన‌ట్లు పేర్కొన్నారు. నీట్ ప‌రీక్షా కేంద్రాల‌కు 200 మీట‌ర్ల దూరంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఇక ప‌రీక్ష కేంద్రాల‌కు 100 మీట‌ర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంట‌ర్లు, ఇంట‌ర్నెల్ సెంట‌ర్ల‌ను మూసివేయాల‌ని ఆదేశించారు. జిరాక్స్, ఇంటర్నెట్ సెంట‌ర్ల‌ను తెరిచి ఉంచితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఈ నిబంధ‌న‌ల నుంచి ఫ్లైయింగ్ స్క్వాడ్ మెంబ‌ర్ల‌కు, మిలిట‌రీ ప్ర‌తినిధుల‌కు, పోలీసుల‌కు, హోం గార్డుల‌కు, అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే వారికి మిన‌హాయింపు ఉంటుంది.

Advertisement
Advertisement