త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Covid-19 | మ‌ళ్లీ విస్త‌రిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్‌.. న‌లుగురు మృతి

Covid-19 | ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌రోనా (Covid-19) మ‌ళ్లీ విస్త‌రిస్తున్న‌ది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh) మ‌హ‌మ్మారి (Corona Virus) వ్యాప్తి ఆందోళ‌న‌క‌లిగిస్తున్న‌ది. గ‌త నెల రోజుల్లోనే క‌రోనాతో (Corona) న‌లుగురు చ‌నిపోగా, 13 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు.

G

National | Published On Jul 17, 2026, 8.20 am IST

Covid-19 | మ‌ళ్లీ విస్త‌రిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్‌.. న‌లుగురు మృతి
Advertisement

Covid-19 | త్రినేత్ర‌.న్యూస్‌: ద‌క్షిణాది రాష్ట్రాల్లో క‌రోనా (Covid-19) మ‌ళ్లీ విస్త‌రిస్తున్న‌ది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో (Andhra Pradesh) మ‌హ‌మ్మారి (Corona Virus) వ్యాప్తి ఆందోళ‌న‌క‌లిగిస్తున్న‌ది. గ‌త నెల రోజుల్లోనే క‌రోనాతో (Corona) న‌లుగురు చ‌నిపోగా, 13 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇక‌ తాజా గ‌ణాంకాంల ప్ర‌కారం ద‌క్షిణాది రాష్ట్రాలైన కేర‌ళ‌లో 115 కేసులు న‌మోద‌వ‌గా, క‌ర్ణాట‌క‌లో 64, త‌మిళ‌నాడులో 39 మంది క‌రోనాతో బాధ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు ఢిల్లీ (18), మ‌హారాష్ట్ర (43), అండ‌మాన్ నికోబార్ దీవుల్లో (13) కొత్తగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.

ఇక ఏపీలో జూన్ 26 నుంచి జూలై 16 వ‌ర‌కు 13 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, న‌లుగురు చ‌నిపోయారు. ప్ర‌స్తుతం న‌లుగురు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన‌వారు వైర‌స్ నుంచి కోలుకుంటున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. మ‌ర‌ణించిన వారంతా క‌డ‌ప (Kadapa) జిల్లాకే చెందిన‌వారు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే మృతుల్లో ఇప్ప‌టికే ఇత‌ర దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌వారు ఉన్న‌ట్లు స‌మాచారం. క‌డ‌ప జిల్లాలోనే జూలై 1 నుంచి 16 వ‌ర‌కు 11 కేసులు న‌మోద‌యిన‌ట్లు వైద్యాధికారులు వెల్ల‌డించారు. గుంటూరు జిల్లాలో 2, విశాఖ‌ప‌ట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్క‌టి చొప్పున కేసులు న‌మోద‌య్యాయి.

ఈ లక్షణాలు ఉంటే జాగ్ర‌త్త‌..

జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇవి సాధారణ వైరల్‌ ఫీవర్‌ లేదా జలుబు లక్షణాలను పోలి ఉండటంతో చాలామంది పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అందువ‌ల్ల‌ ఈ లక్షణాలు రెండు, మూడు రోజులకుపైగా కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచించారు. కాగా, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నప్పటికీ, 60 ఏండ్లు దాటిన వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

Advertisement
Advertisement