Covid-19 | మళ్లీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి.. నెల రోజుల్లో 13 మందికి పాజిటివ్.. నలుగురు మృతి
Covid-19 | దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా (Covid-19) మళ్లీ విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మహమ్మారి (Corona Virus) వ్యాప్తి ఆందోళనకలిగిస్తున్నది. గత నెల రోజుల్లోనే కరోనాతో (Corona) నలుగురు చనిపోగా, 13 మంది వైరస్ బారినపడ్డారు.
Covid-19 | త్రినేత్ర.న్యూస్: దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా (Covid-19) మళ్లీ విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) మహమ్మారి (Corona Virus) వ్యాప్తి ఆందోళనకలిగిస్తున్నది. గత నెల రోజుల్లోనే కరోనాతో (Corona) నలుగురు చనిపోగా, 13 మంది వైరస్ బారినపడ్డారు. ఇక తాజా గణాంకాంల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 115 కేసులు నమోదవగా, కర్ణాటకలో 64, తమిళనాడులో 39 మంది కరోనాతో బాధపడుతున్నారు. మరోవైపు ఢిల్లీ (18), మహారాష్ట్ర (43), అండమాన్ నికోబార్ దీవుల్లో (13) కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇక ఏపీలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు 13 మంది కరోనా బారినపడగా, నలుగురు చనిపోయారు. ప్రస్తుతం నలుగురు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారు వైరస్ నుంచి కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. మరణించిన వారంతా కడప (Kadapa) జిల్లాకే చెందినవారు కావడం గమనార్హం. అయితే మృతుల్లో ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాలోనే జూలై 1 నుంచి 16 వరకు 11 కేసులు నమోదయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..
జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని, ఇవి సాధారణ వైరల్ ఫీవర్ లేదా జలుబు లక్షణాలను పోలి ఉండటంతో చాలామంది పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. అందువల్ల ఈ లక్షణాలు రెండు, మూడు రోజులకుపైగా కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచించారు. కాగా, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది స్వల్ప లక్షణాలతోనే కోలుకుంటున్నప్పటికీ, 60 ఏండ్లు దాటిన వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar vs Nara Lokesh | రేవంత్ చేతులెత్తేశాకే ఆ లొంగుబాటు.. నారా లోకేష్కు ఆర్ఎస్ ప్రవీణ్ స్ట్రాంగ్ రిప్లై!
జులై 15, 2026

Mudragada Padmanabham | అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు
జులై 15, 2026

Mother Kills Son | మద్యానికి బానిసై వేధిస్తున్నాడని.. కన్నకొడుకును కత్తెరతో పొడిచి కడతేర్చింది..
జులై 14, 2026
తాజావార్తలు
- ●Donald Trump | ఫిఫా వరల్డ్కప్ ఫైనల్కు ట్రంప్.. విజేతకు ట్రోఫీ అందించనున్న యూఎస్ ప్రెసిడెంట్
- ●Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్కు చివరిదేనా?.. జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!
- ●Hydrogen Train | నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- ●Vaakiti Srihari | మంత్రి వాకిటి శ్రీహరికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
- ●NEET UG Results | నీట్ యూజీ ఫలితాలు విడుదల.. హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు
- ●Horoscope | జూలై 17 రాశి ఫలాలు.. ఈ రాశివారికి అడ్డంకులు ఉండవచ్చు!

Donald Trump | ఫిఫా వరల్డ్కప్ ఫైనల్కు ట్రంప్.. విజేతకు ట్రోఫీ అందించనున్న యూఎస్ ప్రెసిడెంట్

Rohit Sharma | లార్డ్స్ వన్డే రోహిత్కు చివరిదేనా?.. జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలన్న యోచనలో సెలెక్టర్లు..!

Hydrogen Train | నేడు దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Vaakiti Srihari | మంత్రి వాకిటి శ్రీహరికి తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స



