Dasoju Sravan | నాడు ఔరంగజేబు.. నేడు రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ విభజనపై ఎమ్మెల్సీ దాసోజు కీలక వ్యాఖ్యలు
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : నాడు ఔరంగజేబు కూడా హైదరాబాద్ పేరును ‘దారుల్-జిహాద్’గా మార్చాలని ప్రయత్నించాడు. అది సఫలం కాలేదు. నేడు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ‘మల్కాజిగిరి’ పేరుతో చెరపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం కూడా చరిత్ర ముందే ఓటమి చెందుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : నాడు ఔరంగజేబు కూడా హైదరాబాద్ పేరును ‘దారుల్-జిహాద్’గా మార్చాలని ప్రయత్నించాడు. అది సఫలం కాలేదు. నేడు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ‘మల్కాజిగిరి’ పేరుతో చెరపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం కూడా చరిత్ర ముందే ఓటమి చెందుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో సికింద్రాబాద్లోని బాలంరాయ్ లీ ప్యాలెస్లో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కీలకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ వార్డుల విభజన అనేది అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ కాదు. ముఖ్యమంత్రి, మంత్రి, కమిషనర్ వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా గీతలు గీసి వార్డుల విభజన చేయలేరు. అది ఒక రాజ్యాంగ బద్ధమైన ప్రక్రియ. ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులతో చర్చించిన తర్వాత విభజన చేయాలి. జీహెచ్ఎంసీ వార్డుల విభజన నిరంకుశమైన చర్య. వార్డుల విభజనలో పారదర్శకత లేకుండా, ప్రజలను, ప్రజా ప్రతినిధుల్ని సంప్రదించకుండా, చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి చేసిన కుట్ర ఇది అని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
74వ రాజ్యాంగ సవరణను తుంగలో తొక్కి, ఎన్నికల సంఘాన్ని కాదని ప్రైవేట్ సంస్థలకు (ASCI/CGG) వార్డుల విభజన అప్పగించడం దారుణం. రాజకీయ లబ్ధి కోసం ఓటు బ్యాంకులను విచ్ఛిన్నం చేసేలా వార్డుల సరిహద్దుల మార్పు సరికాదు. 2053 చ.కి.మీల జీహెచ్ఎంసీ విస్తరణ వెనుక 'ఫ్యూచర్ సిటీ' పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణం ఉందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
సికింద్రాబాద్కు 220 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిని మల్కాజిగిరి పేరుతో సమాధి చేయాలని చూడటం చారిత్రక తప్పిదం. లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి ఆలయం, సెయింట్ మేరీస్ చర్చి, క్లాక్ టవర్ వంటి చిహ్నాలు సికింద్రాబాద్ గుర్తింపు. నాడు ఔరంగజేబు సైతం హైదరాబాద్ పేరును 'దారుల్-జిహాద్'గా మార్చాలని చూసి విఫలమయ్యాడని, నేడు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరపాలని చూస్తున్నారని, ఆయనకు ఓటమి తప్పదని శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వార్డుల విభజన మ్యాపులు మరియు ముసాయిదా సమాచారాన్ని వెంటనే బహిర్గతం చేయాలని, ప్రతి వార్డులో పౌరులు మరియు ప్రజాప్రతినిధులతో బహిరంగ విచారణ జరపాలి. సికింద్రాబాద్ను ఒక ప్రత్యేక పరిపాలనా, చారిత్రక విభాగంగానే కొనసాగించాలని, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే విభజన ప్రక్రియ జరగాలి. నగర వారసత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి పౌరులందరూ ఏకమై ఈ నిరంకుశ పోకడలపై పోరాడాలని డాక్టర్ శ్రవణ్ దాసోజు పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



