త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..

Students Attack | హైద‌రాబాద్‌లోని ఎల్బీన‌గ‌ర్‌లో ఉన్న అవినాశ్ కాలేజీలో (Avinash College) దారుణం చోటుచేసుకుంది. 30 మందితో వ‌చ్చిన ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ ముందే స‌హ‌చ‌ర విద్యార్థిపై దాడికి (Students Attack) పాల్ప‌డ్డాడు.

G

Hyderabad | Published On Sep 10, 2026, 12.27 pm IST

Students Attack | 30 మందితో వచ్చి.. ప్రిన్సిపాల్ ముందే విద్యార్థిని చితకబాదారు..
Advertisement

Students Attack | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని ఎల్బీన‌గ‌ర్‌లో ఉన్న అవినాశ్ కాలేజీలో (Avinash College) దారుణం చోటుచేసుకుంది. 30 మందితో వ‌చ్చిన ఓ విద్యార్థి ప్రిన్సిపాల్ ముందే స‌హ‌చ‌ర విద్యార్థిపై దాడికి (Students Attack) పాల్ప‌డ్డాడు. దీంతో బాధిత విద్యార్థి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు కాలేజీ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. ఈనేప‌థ్యంలో కాలేజీ వ‌ద్ద ఉద్రిక్త‌త చోటుచేసుకుంది.

మ‌నిచ‌ర‌ణ్‌, అమ‌న్ అనే ఇద్ద‌రు విద్యార్థుల మ‌ధ్య‌ బుధ‌వారం గొడ‌వ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో మనిచరణ్‌కు చెందిన సుమారు 30 మంది కాలేజీకి వచ్చి, ప్రిన్సిపాల్ (Principal) సమక్షంలోనే అమన్‌పై దాడి చేశారు. విచ‌క్ష‌ణా ర‌హితంగా చితకబాదినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘ‌ట‌న‌పై బాధితుడి త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ త‌న సీట్‌లో ఉండగానే విద్యార్థిపై దాడి జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్ర‌శ్నిస్తున్నారు. కాలేజీ వ‌ద్ద ఆందోళనకు దిగారు. 30 మంది కాలేజీలోకి ఎలా వచ్చారని, భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని యాజ‌మాన్యాన్ని నిల‌దీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement