Bananas | అరటి పండ్లను ఫ్రిజ్లో పెట్టొద్దని చెబుతున్న పరిశోధకులు.. ఎందుకంటే..?
Bananas | సాధారణంగా చాలా మంది ఏవైనా పండ్లను తెస్తే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయని ఫ్రిజ్లో పెడుతుంటారు. అది సరైందే అయినప్పటికీ అన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు. ముఖ్యంగా అరటి పండ్లను ఫ్రిజ్లలో నిల్వ చేయకూడదని, అలా చేస్తే వాటి రుచి, వాసన దెబ్బ తింటాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో తేలింది.
Bananas | సాధారణంగా చాలా మంది ఏవైనా పండ్లను తెస్తే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయని ఫ్రిజ్లో పెడుతుంటారు. అది సరైందే అయినప్పటికీ అన్ని రకాల పండ్లను ఫ్రిజ్లో పెట్టకూడదు. ముఖ్యంగా అరటి పండ్లను ఫ్రిజ్లలో నిల్వ చేయకూడదని, అలా చేస్తే వాటి రుచి, వాసన దెబ్బ తింటాయని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో తేలింది. అరటి పండ్లకు ప్రత్యేకమైన వాసన, రుచి ఇవ్వడానికి బాధ్యత వహించే కీలక ప్రోటీన్లు, జన్యు కార్యకలాపాలను చల్లని ఉష్ణోగ్రతలు దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్నే చిల్లింగ్ ఇంజరీ అని వారు వ్యవహరిస్తున్నారు. ఈ చిల్లింగ్ ఇంజరీ కారణంగా పండులో బ్రౌనింగ్, అసమానమైన టెక్స్చర్, సహజ రసాయన సమతుల్యత లోపం వంటి సమస్యలు తలెత్తి అరటి పండ్ల నాణ్యత తగ్గిపోతుందని తెలిపారు.
రుచి, వాసన, టెక్స్చర్ పై ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బిలియన్ల సంఖ్యలో అరటి పండ్లు వినియోగంలోకి వస్తున్నాయి. మార్కెట్లకు చేరుకునే ముందు ఇవి సాధారణంగా శీతలీకరణ రవాణా ప్రక్రియలో భాగమవుతాయి. చాలా మంది అరటి పండ్లను ఇతర పండ్లలా ఫ్రిజ్లో ఉంచితే ఎక్కువకాలం తాజాగా ఉంటాయని భావిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల వాటి రుచి, వాసన, టెక్స్చర్ నెమ్మదిగా దెబ్బతింటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పండులోని పసుపు తొక్క వెనుక జీవశాస్త్రం, ఉష్ణోగ్రత సున్నితత్వంతో నడిచే క్లిష్టమైన పక్వ ప్రక్రియ ఉంటుంది. చల్లని నిల్వ కేవలం పక్వాన్ని ఆలస్యం చేయడమే కాకుండా అరటి పండ్లకు ప్రత్యేకమైన రుచి, వాసనను కలిగించే జీవ రసాయన వ్యవస్థలకు కూడా భంగం కలిగిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
ప్రోటీన్ల కార్యకలాపాలకు ఆటంకం..
అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చల్లని ఉష్ణోగ్రతలు అరటి పండ్ల ప్రత్యేక సువాసనకు కారణమయ్యే ప్రోటీన్ల కార్యకలాపాలను తగ్గిస్తాయి. పక్వ ప్రక్రియలో జన్యు కార్యకలాపాలను నియంత్రించే ముఖ్యమైన ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లపై చల్లని ఉష్ణోగ్రతలు ప్రభావం చూపి, పండ్లలో వాసన తక్కువవుతుందని పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న అరటి పండ్లను మార్కెట్కు తరలించే ముందు శీతలీకరణలో నిల్వ చేస్తారు. ఈ విధానం వల్ల రవాణా సమయంలో పండ్లు ముందస్తుగా పక్వానికి గురి కాకుండా నిరోధించవచ్చు. అయినప్పటికీ ఆ ప్రభావం వల్ల తరువాత పరిస్థితుల్లో అరటి పండ్లు నెమ్మదిగా పక్వం చెందడం, అసహజమైన రుచి అభివృద్ధి చెందడం గుర్తించారు. పండ్లలో సహజ రసాయన సమతుల్యత దెబ్బతిన్నదనే సంకేతాన్ని ఆ లక్షణాలు తెలియజేస్తాయని పేర్కొన్నారు.

జన్యువుల పనితనంపై ప్రభావం..
అధ్యయనంలో MabZIP4, MabZIP5 వంటి ప్రత్యేక ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లు సువాసన ఉత్పత్తికి కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. చల్లని ఉష్ణోగ్రతలకు అరటి పండ్లు గురయ్యే సమయంలో ఈ ఫ్యాక్టర్ల కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల వాసన, రుచి ఇచ్చే జన్యువుల పనితనం తగ్గిపోతుంది. చల్లని ఉష్ణోగ్రతలు పక్వాన్ని కేవలం ఆపడమే కాకుండా, అరటి పండ్లు రుచిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నిర్ణయించే ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తాయని గుర్తించారు. ఇక నిర్మాణాత్మకంగా కూడా అరటి పండ్లపై చల్లని ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని మరో అధ్యయనం వెల్లడించింది. కంపారిటివ్ అనాలిసిస్ ఆఫ్ చిల్లింగ్ ఇంజరీ ఇన్ బనానా ఫ్రూట్ డ్యురింగ్ స్టోరేజ్ అనే పరిశోధనలో, సుమారు 7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద పండ్లను నిల్వ చేయడం వల్ల చిల్లింగ్ ఇంజరీకి దారితీస్తుందని తేలింది. ఈ పరిస్థితి పండ్లలో బ్రౌనింగ్, తేమ అసమాన పంపిణీ, నెమ్మదిగా మృదువుగా మారడం వంటి లక్షణాల రూపంలో కనిపిస్తుంది.
ఫ్రిజ్లో పెట్టొద్దు..
మైక్రో స్థాయిలో పరిశీలించినప్పుడు కణ గోడల నష్టం, సెల్యులార్ నిర్మాణానికి నష్టం కలగడం, స్టార్చ్ మార్పిడి ప్రక్రియలో అంతరాయం వంటి మార్పులు కనిపించాయి. ఇవన్నీ కలిపి పండ్లలో టెక్స్చర్, రుచి నాణ్యతను తగ్గిస్తాయి. అధునాతన ఇమేజింగ్ సాంకేతికతలను ఉపయోగించి చేసిన పరిశోధనల ప్రకారం, పండ్లలో కనిపించే లక్షణాలు బయటపడకముందే ఈ మార్పులను గుర్తించారు. హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ ద్వారా పండులోని అంతర్గత నిర్మాణంలో సున్నితమైన మార్పులను గుర్తించగలిగారు. ఈ డేటా ఆధారంగా రూపొందించిన మెషిన్ లెర్నింగ్ మోడళ్లు ప్రారంభ దశలోనే ప్రభావితమైన అరటి పండ్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలిగాయి. దీన్ని బట్టి అరటి పండ్లను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయకూడదని సైంటిస్టులు తేల్చారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



