త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక‌.. హాజ‌రైన సీఎం రేవంత్‌

Bonalu | సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికార నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. బోనాల విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి ఆత్మీయ స్వాగతం పలికారు.

P

Hyderabad | Published On Aug 2, 2026, 8.44 pm IST

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక‌.. హాజ‌రైన సీఎం రేవంత్‌
Advertisement

Bonalu | సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికార నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. బోనాల విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, వివేక్‌ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విందు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అతిథులను ఆప్యాయంగా పలకరించి, స్వయంగా ఆతిథ్యం అందించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ తల్లి మల్లమ్మ, సతీమణి మంజుల, కుమారులు పృథ్వీ, ప్రణవ్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులను పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన దృశ్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు ఒకే వేదికపై కలుసుకున్న ఆత్మీయ సమావేశంగా మారింది.

Advertisement
Advertisement