Pawan Kalyan | కొండగట్టులో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు – అభివృద్ది పనులకు శంకుస్థాపన
ఏపీ డిప్యూటీ సీఏం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజనేయస్వామిని శనివారం దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో నిర్మించనున్న విశ్రాంతి గదులు, దీక్ష మండప నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ చేశారు.
Flash news | Published On Jan 3, 2026, 1.47 pm IST
Pawan Kalyan | ఏపీ ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు అంజనేయస్వామిని దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, పూజారులు పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు. భక్తుల వసతి సౌకర్యాల కోసం విశ్రాంతి గదులు, ధర్మశాలతో పాటు దీక్ష విరమణ మండపానికి 35.19 కోట్లు టీటీడీ నిధులు మంజూరు చేసింది. ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన భూమి పూజా పనులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగాయి.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో తనకు ఓ విద్యుత్ ప్రమాదం జరిగిందని, ఆ సంఘటన నుంచి కొండగట్టు అంజనేయస్వామి దయతోనే తాను క్షేమంగా బయటపడ్డానని చెప్పారు. కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని తెలిపారు. దేవుడి దయ వల్లే ఈ అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టామని పేర్కొన్నారు.
గతంలో కొండగట్టును దర్శించుకున్న సమయంలో దీక్ష విరమణ సత్రం గదులు కావాలని భక్తులు కోరారు. వాటి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయ్యేలా చేస్తానని మాటిచ్చాను. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకుల కృషి వల్లే అభివృద్ధి పనులు మొదలుపెట్టాగలిగామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
వంద గదులతో...
100 గదులతో గదులతో కూడిన అతిథి గృహం, 2000 మంది భక్తులకు సరిపోయేలా దీక్ష విరమణ మండపం నిర్మించబోతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి తన ఇష్టదైవమని పలుమార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. డిప్యూటీ సీఏంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొండగట్టును దర్శించుకున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన తర్వాత తెలంగాణలోని జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



