త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Guppedantha Manasu Sequel | రిషికి ఐ ల‌వ్ యూ చెప్పిన వ‌సుధార – గుప్పెడంత మ‌న‌సు 2 పై అప్‌డేట్‌?

లాంగ్ గ్యాప్ త‌ర్వాత రిషి, వ‌సుధార జోడీ మ‌ళ్లీ బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వీరిద్ద‌రు క‌లిసి ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం షోకు గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో రిషికి వ‌సుధార ఐ ల‌వ్ యూ చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది.

N

Entertainment | Published On Aug 1, 2026, 6.12 pm IST

Guppedantha Manasu Sequel | రిషికి ఐ ల‌వ్ యూ చెప్పిన వ‌సుధార – గుప్పెడంత మ‌న‌సు 2 పై అప్‌డేట్‌?
Advertisement

Guppedantha Manasu Sequel | గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో రిషి, వ‌సుధార జోడీ ఫేమ‌స్ అయ్యింది. స్టార్ మాలో (Star Maa Serial) టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్ పెద్ద స‌క్సెస్ కావ‌డానికి వీరిద్ద‌రి కెమిస్ట్రీనే కార‌ణ‌మైంది. రిషి పాత్ర‌లో ముఖేష్ గౌడ‌ (Mukesh Gowda ), వ‌సుధార క్యారెక్ట‌ర్‌లో ర‌క్షా గౌడ (Raksha Gowda) న‌టించారు. దాదాపు నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్‌కు 1168 ఎపిసోడ్స్‌తో ఎండ్ చేశారు. గుప్పెడంత మ‌న‌సును అర్ధాంత‌రంగా ముగించ‌డంతో రిషి, వ‌సుధార ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు.

గెస్ట్‌లుగా...

గుప్పెడంత మ‌న‌సు త‌ర్వాత రిషి, వ‌సుధార కాంబినేష‌న్‌లో మ‌రో సీరియ‌ల్ వ‌స్తే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ చాలా రోజులుగా కోరుకుంటున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ జోడీ మ‌ళ్లీ బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అయితే సీరియ‌ల్‌లో కాదు...ఓ టీవీ షోకు వీరిద్ద‌రు గెస్ట్‌లుగా వ‌చ్చారు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం ఈ వారం ఎపిసోడ్‌లో టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌తో పాటు డిజిట‌ల్ స్టార్స్ గెస్ట్‌లుగా రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

ఐ ల‌వ్ యూ...

ఈ ప్రోమోకు వ‌సుధార‌, రిషి ఇద్ద‌రూ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా క‌నిపించారు. గుప్పెడంత మ‌న‌సులోని కొన్ని సీన్ల‌ను రీక్రియేట్ చేశారు. రిషికి వ‌సుధార ఐ ల‌వ్ యూ చెప్పింది. రిషి నువ్వు నా లైఫ్‌లోకి వ‌స్తే ఫుల్ ఖుషి. ఐ ల‌వ్ యూ రిషి సార్ అంటూ వ‌సుధార చెప్ప‌డం ప్రోమోలో ఆస‌క్తిని పంచింది. రిషిధార‌ల జోడీ బాగుంద‌ని, వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గుప్పెడంత మ‌న‌సు 2 రావాలి అంటూ ఈ ప్రోమోను ఉద్దేశించి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆగ‌స్ట్ 2న ప్ర‌సారం కానున్న ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం ఎపిసోడ్‌లో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ సీక్వెల్‌పై అనౌన్స్‌మెంట్ ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మాన‌స్ నాగుల‌ప‌ల్లి, శ్రీహాన్‌

ఈ ఎపిసోడ్‌కు ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ‌తో పాటు శ్రీహాన్‌, మాన‌స్ నాగుల‌ప‌ల్లి, స‌మీరా, బిగ్‌బాస్ రాము రాథోడ్ త‌దిత‌రులు గెస్ట్‌లుగా వ‌చ్చారు. ఈ ప్రోమో వైర‌ల్ అవుతోంది.

;

Advertisement
Advertisement