Ponnam Prabhakar | సీఎం రేవంత్రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు
Ponnam Prabhakar | రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, న్యాయ నిపుణుల సహకారంతో సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించామని తెలిపారు. ఈ తీర్పు మూడు కీలక ప్రాజెక్టులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మంత్రి చెప్పారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు అనేక ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరనున్నాయని పేర్కొన్నారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో సీఎం రేవంత్రెడ్డి చూపిన చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి కొనియాడారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●HMDA | మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా మారాలి
- ●KTR | తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు : కేటీఆర్
- ●RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్ల్లో ఒకే వడ్డీ..
- ●ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు
- ●Arvind Kejriwal | ఈ20 పెట్రోల్ ధరలు తగ్గించాలి.. ఆగస్టు 4న ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన కేజ్రీవాల్
- ●Anupama Parameswaran | బ్రేకప్ రూమర్లపై అనుపమ రియాక్షన్ - నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్స్

HMDA | మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా మారాలి

KTR | తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు : కేటీఆర్

RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్ల్లో ఒకే వడ్డీ..

ఒక్కరోజులోనే 2.20 లక్షలు దాటిన ‘మీసేవ’ లావాదేవీలు




