త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు

Ponnam Prabhakar | రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

P

Telangana | Published On Aug 1, 2026, 6.12 pm IST

Ponnam Prabhakar | సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, న్యాయ నిపుణుల సహకారంతో సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించామని తెలిపారు. ఈ తీర్పు మూడు కీలక ప్రాజెక్టులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని మంత్రి చెప్పారు. గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు అనేక ప్రాంతాల తాగునీటి అవసరాలు తీరనున్నాయని పేర్కొన్నారు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో సీఎం రేవంత్‌రెడ్డి చూపిన చొరవ, ప్రభుత్వం చేసిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని మంత్రి కొనియాడారు.

Advertisement
Advertisement