త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..

RBI | దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేసిన కస్టమర్లకు దేశంలోని ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే వడ్డీ రేటు ఇవ్వాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

S

Business | Published On Aug 1, 2026, 5.18 pm IST

RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..
Advertisement

RBI | దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకే రోజు, ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేసిన కస్టమర్లకు దేశంలోని ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే వడ్డీ రేటు ఇవ్వాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకే బ్యాంకుకు చెందిన వేర్వేరు బ్రాంచ్‌లలో ఒకే డిపాజిట్‌కు వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వడాన్ని ఇకపై అనుమతించరు. ఈ కొత్త నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ - ఇంటరెస్ట్ రేట్స్ ఆన్ డిపాజిట్స్) సెకండ్ అమెండ్‌మెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ 2026 పేరుతో జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

వ‌డ్డీ రేట్ల‌ను క‌చ్చితంగా చెప్పాలి..

ఆర్‌బీఐ సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ అధికారిక వెబ్‌సైట్‌ల‌లో ప్రకటించిన డిపాజిట్ వడ్డీ రేట్లనే అన్ని బ్రాంచ్‌లలో అమలు చేయాలి. ఒక కస్టమర్ దేశంలోని ఏ నగరంలోనైనా, ఏ బ్రాంచ్‌లోనైనా ఒకే రోజు ఒకే మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, అతనికి ఒకే వడ్డీ రేటు వర్తించాలి. అదే రోజు, అదే మొత్తానికి వేర్వేరు వడ్డీ రేట్లు ఇవ్వడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పారదర్శకతను మరింత పెంచేందుకు బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్ల ప్రకటనకు కూడా ఆర్‌బీఐ నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించింది. ప్రతి పని దినం ఉదయం 10 గంటలలోపు అన్ని బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్టంగా 10 నిమిషాల సడలింపు మాత్రమే ఇచ్చింది. అంటే ఏ పరిస్థితుల్లోనైనా ఉదయం 10:10 గంటలలోపు వడ్డీ రేట్లను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయడం తప్పనిసరి.

అక్టోబ‌ర్ 1 నుంచి అమ‌లు..

అయితే లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్‌సీఆర్) ఫ్రేమ్‌వర్క్ కింద బల్క్ డిపాజిట్లపై పరిమిత స్థాయిలో వడ్డీ రేట్లలో తేడా ఉంచేందుకు బ్యాంకులకు అవకాశం కల్పించింది. కానీ ఆ తేడా బ్యాంకుల ఇష్టానుసారం కాకుండా, బలమైన, సమర్థనీయమైన ఆర్థిక ప్రమాణాల ఆధారంగా మాత్రమే ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. జూన్‌లో విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఈ తుది నిబంధనలను రూపొందించింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలతో బ్యాంకు డిపాజిట్లపై కస్టమర్లకు మరింత పారదర్శకమైన, సమానమైన వడ్డీ రాబడి లభించే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement